స్థానిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేస్తున్న చీర్ల రాజేష్…

స్థానిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేస్తున్న చీర్ల రాజేష్

విజయానికి అన్ని వర్గాల మద్దతు తనకే అని ధీమా వ్యక్తం

ఇంటింటికి బొట్టు పెట్టి ఓట్లు అడుగుతూ గెలుపే లక్ష్యంగా ప్రచారం

తాండూర్,మంచిర్యాల నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి చీరల రాజేష్ స్థానిక ఎన్నికలలో విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ముమ్మరంగా సాగడంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొత్తపల్లి గ్రామానికి చెందిన చిర్ల రాజేష్ తమ గ్రామంలో ప్రతి గడపగడపకు వెళ్తూ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అలాగే కొత్తపల్లి గ్రామంలో బీసీ రిజర్వేషన్ రావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోటీ నెలకొంది.చీర్ల రాజేష్ ఇదివరకే ఉపసర్పంచ్ పదవిలో కొనసాగి ప్రజా సమస్యలపై పట్టున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. తను గ్రామానికి ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. అంతేకాకుండా గ్రామస్తులతో తనకు తన కుటుంబానికి ఎనలేని ఆప్యాయత అనుబంధం ఉందని అన్నారు.తనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని, తనే పోటీలో సర్పంచ్ అభ్యర్థి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

పంచాయతీ ఎన్నికలలో పద్మశాలి బీసీ బిడ్డల గెలుపుకు కృషి..

పంచాయతీ ఎన్నికలలో పద్మశాలి బీసీ బిడ్డల గెలుపుకు కృషి

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్స్ గా, సర్పంచులు గా పోటీ చేస్తున్న పద్మశాలి బీసీ బిడ్డలని భారీ మెజార్టీతో గెలిపించాలని పద్మశాలి సంఘం అధ్యక్షుడు గజ్జల వెంకటయ్య కోరారు.అదేవిధంగా రాష్ట్రం లోని పద్మశాలి బీసీ వర్గాలు కృషి చేసి అత్యధిక స్థానాలు గెలిపించి మన బీసీల సత్తా రాష్ట్ర వ్యాప్తంగా చాటాలని తెలిపారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ,వివిధ బీసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకుడు,తెలంగాణ ఉద్యమకారుడు,పద్మశాలి సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధిపత్య కులాలకు అడ్డుకట్ట వేయాలంటే బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికలే పునాది రాళ్లుగా భావించి మన ఐక్యత మన ఆత్మ గౌరవం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల్లో మన ఓటు మన పద్మశాలి బీసీల నాయకులకే వెయ్యాలన్నారు.ఓటు మనదే అధికారం కూడా మనదే కావాలి.మన పద్మశాలి,బీసీ నాయకులను గెలిపించుకునే బాధ్యత కూడా మనదే అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య ,పద్మశాలి సంఘం,బీసీ సంఘాల నాయకులు ఏ.రాజేశం, సిహెచ్.రామస్వామి,జే. నారాయణ,రాందాస్,అశోక్ వేముల,డి.లక్ష్మీనారాయణ, సత్యనారాయణ,బొద్దున బాపురావు,బాపు,పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version