రంజాన్ సందర్భంగా సరైన నిర్వహణ పరిశుభ్రత ఏర్పాట్ల నిర్వహించాలి..

రంజాన్ సందర్భంగా సరైన నిర్వహణ పరిశుభ్రత ఏర్పాట్ల నిర్వహించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

పవిత్ర రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో, కోహిర్ మున్సిపల్ కార్పొరేషన్ మసీదు, పాటు కోహిర్ ఇతర కేంద్ర మసీదుల ప్రాంగణాలలో పరిశుభ్రతపై దృష్టి పెటలని. రంజాన్ పండుగ వేళ ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం భారీగా తరలివచ్చే మసీదు కట్టడాల పరిసరాలను క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచాలని అధికారులు నిర్ణయించాలని వార్డ్ నంబర్ 13 లో
ఇందులో భాగంగా బుధవారం కమిషనర్ వినతి అందించారు ప్రాంతంలో పర్యటించి పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి.చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలను సందర్శించాలని. ఈ పర్యటన సందర్భంగా, ఆయన మసీదు, ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యకలాపాలను సమీక్షించాలని. పవిత్ర ఇస్లాం మాసం ప్రారంభం కానుండటంతో కోహిర్ పట్టణంలోని రోడ్లు, జంక్షన్లను పరిశుభ్రంగా విధి దీపాలు తాగునీటి సమస్య ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులను ఆదేశించాలని కోరారు.

ఏఐఎంఐఎం పార్టీ విజయంతోనే పురపాలక సంఘం అభివృద్ధి…

ఏఐఎంఐఎం పార్టీ విజయంతోనే పురపాలక సంఘం అభివృద్ధి

◆-: ఎన్నికల్లో ఏఐఎంఐఎం అభ్యర్థులకు ఆదరించండి :

◆-: ఏఐఎంఐఎం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,పురపాలక సంఘం ఎన్నికల్లో ఏఐఎంఐఎం పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధిస్తే మున్సిపాలిటీలు గణనీయంగా అభివృద్ధి సాధిస్తాయని ఝరాసంగం ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో ఏఐఎంఐఎం పార్టీ పక్షాన పెద్దఎత్తున ఓట్లు వేస్తే పట్టణాల అభివృద్ధికి ఓటు వేసినట్టే నని, జహీరాబాద్ పట్టణ, కోహిర్ పట్టణాల అభివృద్ధి కోసం పార్లమెంట్ సభ్యులు పార్టీ అధ్యక్షులు బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆశీస్సులతో అభివృద్ధి సాధిస్తాయని, పార్టీకి పట్టం కడితే వారు మరింత బాధ్యతాయుతంగా అభివృద్ధి చేస్తారని, కావున పట్టణ ఓటర్లు అభివృద్ధి, సమర్థతకు పెద్దపీట వేసి ఏఐఎంఐఎం పార్టీ విజయానికి తోడ్పాటు అందించాలని మండల అధ్యక్షులు షేక్ రబ్బాని కోరారు.

ప్రజల తీర్పు స్పష్టం, కోహిర్ మునిసిపాలిటీ కైవసమే లక్ష్యం…

ప్రజల తీర్పు స్పష్టం, కోహిర్ మునిసిపాలిటీ కైవసమే లక్ష్యం

◆-: మునిసిపల్ ఎన్నికల ప్రచార భారీ ర్యాలీలో మరియు కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నా

◆-: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ పట్టణంలోని మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీతో ప్రారంభమై 16 వార్డుల అభ్యర్థులకు మద్ధతుగా బీదర్ బేస్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో పాల్గొనడం జరిగింది.ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ 10 ఏండ్ల బి.ఆర్.స్ పాలనలో కోహిర్ పట్టణం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు, ఎ బస్తీకి కి వెళ్లినా ఆ ప్రాంత ప్రజల బాధలు వర్ణనాతీతం,ఒక్కరు కూడా వారి పాలనలో వారిని పట్టించుకున్నా పాపాన పోలేదు. అందుకని మీకు మాట ఇస్తున్నాం మన పార్టీ ప్రకటించిన 16 వార్డు సభ్యులను మీరు ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధిని మీ ముందుకు తీసుకువచ్చి గెలిచిన సభ్యులతో పని చెప్పించే బాధ్యత నాది.అందుకని రాష్ట్రంలో ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమా పథకాలు అమలుఅవుతున్నాయి..ఈ అభివృద్ధి పరంపర ఇలాగే కొనసాగలంటే అధికార పార్టీకి ఓటు వేసి కోహిర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఓటర్లను కోరడం జరిగింది.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శంషీర్ , ఆత్మ కమిటీ చైర్మన్ రామ లింగారెడ్డి, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫాసియోద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్,16 వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కోహిర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ పట్టణం లోని భారత్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కోహిర్ పట్టణం మహ్మద్ అబ్దుల్ ముజమ్మిల్ వివాహా వలిమా వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ వలిమా వేడుకల్లో మాజీ ఎంపీపీ షౌకత్ అలీ,మాజీ వైస్ ఎంపీపీ షాకిర్ అలీ,మాజీ కో.అప్షన్ జలీల్,మాజీ సర్పంచ్ నర్సింలు,సత్తార్ సాబ్,చెంగల్ జైపాల్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

కొహీర్ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు దినకర్ గారి మాతృమూర్తి గారు మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటీ మాణిక్ రావు వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి ,అండగా ఉంటాం అని మనోధైర్యాన్ని కల్పించారు.ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మాజీ సర్పంచ్ ఖళీమ్, సందీప్, వాజీద్ తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version