ప్రజల తీర్పు స్పష్టం, కోహిర్ మునిసిపాలిటీ కైవసమే లక్ష్యం
◆-: మునిసిపల్ ఎన్నికల ప్రచార భారీ ర్యాలీలో మరియు కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నా
◆-: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ పట్టణంలోని మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీతో ప్రారంభమై 16 వార్డుల అభ్యర్థులకు మద్ధతుగా బీదర్ బేస్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో పాల్గొనడం జరిగింది.ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ 10 ఏండ్ల బి.ఆర్.స్ పాలనలో కోహిర్ పట్టణం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు, ఎ బస్తీకి కి వెళ్లినా ఆ ప్రాంత ప్రజల బాధలు వర్ణనాతీతం,ఒక్కరు కూడా వారి పాలనలో వారిని పట్టించుకున్నా పాపాన పోలేదు. అందుకని మీకు మాట ఇస్తున్నాం మన పార్టీ ప్రకటించిన 16 వార్డు సభ్యులను మీరు ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధిని మీ ముందుకు తీసుకువచ్చి గెలిచిన సభ్యులతో పని చెప్పించే బాధ్యత నాది.అందుకని రాష్ట్రంలో ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమా పథకాలు అమలుఅవుతున్నాయి..ఈ అభివృద్ధి పరంపర ఇలాగే కొనసాగలంటే అధికార పార్టీకి ఓటు వేసి కోహిర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఓటర్లను కోరడం జరిగింది.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శంషీర్ , ఆత్మ కమిటీ చైర్మన్ రామ లింగారెడ్డి, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫాసియోద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్,16 వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కోహిర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
