పంటలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం

పంటలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్ శాస్త్రవేత్తల బృందం భూపాలపల్లి జిల్లా లోని, మొగుళ్లపల్లి మండలం, రంగాపురం గ్రామంలో వివిధ పంట పొలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్. యు నాగభూషణం మాట్లాడుతూ రైతులు కలుపు యాజమాన్యం పై రైతు జాగ్రత్త వహించాలని.. గడ్డి జాతి కలుపు మొక్కల నివారణకు ఫినాక్సి ప్రాప్ ఈథైల్ (రైస్ స్టార్) అనే మందును ఎకరాకి 350 మిల్లీమీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు. అలాగే వెడల్పాటి ఆకు కలుపు మరియు తుంగ నిర్మూలనకై ట్రై ఫోమో + ఈత్ ఆక్సీ సల్ఫురాన్
( కౌన్సిల్ ఆక్టివ్) మందును ఎకరానికి 90 గ్రాములు చొప్పునరో డువందలులీటర్ల నీటిలో పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు.. అలాగే పత్తి పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చేచే పురుగుల నివారణకై వేప నూనె (1500 పి పి ఎం) ఎకరాకు లీటర్ మందు చొప్పున లేదా అసిఫేట్ ఎకరాక మూడు వందల గ్రాములు చొప్పున పిచికారి చేసుకోవాలని. అంతేకాకుండా 1:4 నిష్పత్తిలో మోనోక్రోటఫాస్ లేదా 1:20 నిష్పత్తిలో ఇమిడా క్లోరోప్రీడ్ లేదా ఫ్లునికామైడ్ మందును నీటిలో కలుపుకొని బొట్టు పెట్టే పద్ధతి ద్వారా లేత కారణానికి అంటే విధంగా మొక్కలకు పూసుకోవాలి అని సూచించారు. ఈ బృందం సభ్యులు శాస్త్రవేత్త డా// ఆర్ విశ్వతేజ, మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి, తో పాటు ఏ ఈ ఓలు, అభ్యుదయ రైతులు పోలినేని రాజేశ్వర్ రావు,ఎర్రబెల్లి శ్రీనివాస రావు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version