ఈనెల 12న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయండి…

ఈనెల 12న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయండి

భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులు, చట్టాలను రక్షించుకుందాం. యావత్తు కార్మికుల ఐక్యతను చాటుదాం. దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, ఫిబ్రవరి 12 తేదీ 2026 న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక జాతీయ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఎఐసిసిటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కన్నూరి దనియల్ పిలుపునిచ్చారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి.
కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కొనసాగిస్తూ అమలు చేయాలి.
8 గంటల పని విధానం షరతులు లేకుండా అమలు చేయాలి.
కార్మికులు అంటే బానిసలు కాదు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలి.
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పని భద్రత ఇవ్వాలి.
అభివృద్ధి అంటే కార్పొరేట్ పెట్టుబడుదారులే కాకుండా కార్మికులందరి అభివృద్ధికి ఉపయోగపడాలి. జిబి జి రామ్ జి చట్టం రద్దు చేయాలి.
జాతీయ విత్తన చట్టం రద్దు చేయాలి విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి.బిజెపి ప్రభుత్వం కార్మికుల, ప్రజా వ్యతిరేక విధనాలు ఉపసంహరించుకోవాలి. వారు డిమాండ్ చేశారు

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

వీబీ జి రాంజీ పథకాన్ని వెనక్కి తీసుకోవాలి

ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కన్నూరి దానియేలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కన్నూరి దానియేలు
ఈ సందర్భంగా ఏఐసీటియుజిల్లా కార్యదర్శి కన్నూరి దానియేలు
మాట్లాడుతూ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా 2005 వ సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. 25 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో 100 రోజుల కరువు పనిని ఇప్పుడున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం కుట్ర పొంది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబి జి రామ్ జీ పథకాన్ని పార్లమెంటులో చట్టాన్ని తీసుకువచ్చి బిల్లు ఆమోదించడం జరిగింది. గత 25 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం 90% నిధులతో గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఎంతో గాను ఉపయోగపడే ఉపాధిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇప్పుడు ఈ చట్టంలో 60% నిధుల కేంద్రం 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కొత్త చట్టాన్ని తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి భారం వేస్తుందని తెలిపారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ జాతీయ ఉపాధి పథకాన్ని భూస్వాముల పెత్తందారులకు, బడా బాబులకు అనుకూలంగా పేద రైతు కూలీలకు వ్యతిరేకంగా ఈ పథకం ఉందని అన్నారు. వెంటనే పాత పథకాన్ని అమలులోకి తీసుకురావాలని కొత్తగా తీసుకువచ్చిన వీబి జి రామ్ జి పథకాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version