ఈనెల 12న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయండి
భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులు, చట్టాలను రక్షించుకుందాం. యావత్తు కార్మికుల ఐక్యతను చాటుదాం. దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, ఫిబ్రవరి 12 తేదీ 2026 న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక జాతీయ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఎఐసిసిటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కన్నూరి దనియల్ పిలుపునిచ్చారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి.
కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కొనసాగిస్తూ అమలు చేయాలి.
8 గంటల పని విధానం షరతులు లేకుండా అమలు చేయాలి.
కార్మికులు అంటే బానిసలు కాదు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలి.
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పని భద్రత ఇవ్వాలి.
అభివృద్ధి అంటే కార్పొరేట్ పెట్టుబడుదారులే కాకుండా కార్మికులందరి అభివృద్ధికి ఉపయోగపడాలి. జిబి జి రామ్ జి చట్టం రద్దు చేయాలి.
జాతీయ విత్తన చట్టం రద్దు చేయాలి విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి.బిజెపి ప్రభుత్వం కార్మికుల, ప్రజా వ్యతిరేక విధనాలు ఉపసంహరించుకోవాలి. వారు డిమాండ్ చేశారు
