4లేబర్ కోడ్స్, జిబి జీ రామ్ జి చట్టం రద్దు చేయాలి…

4లేబర్ కోడ్స్, జిబి జీ రామ్ జి చట్టం రద్దు చేయాలి

విజయవంతం అయిన జాతీయ సమ్మె

సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

4 లేబర్ కోడ్స్,జిబిజి రామ్ జి చట్టం, విత్తన చట్టం రద్దు చేయాలని,8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని పిలుపు నిచ్చిన జాతీయ సమ్మె విజయవంతం అయ్యిందని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్,ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ( ఎఐసిసిటియు )జిల్లా కార్యదర్శి కన్నూరి దానియెల్ కోరారు. ఈ సందర్బంగా వారు టేకుమట్ల మండల కేంద్రంలో మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన 4లేబర్ కోడ్స్ రద్దు చేస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కొనసాగించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ జిబిజి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని, జాతీయ విత్తన చట్టం, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కార్మికుల, ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించు కోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ సంపూర్ణ మద్దతు తెలిపారు.కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు మచ్చ రాజయ్య, మారపెల్లి కొమురయ్య, రామ్ కుమారస్వామి, రాం వర్ధన్, తిప్పనవేని యుగేందర్,సముద్రాల సరోత్తమ్, ఎలుకటి జంపయ్య, ఎలుకటి కుమార్, జీడీ ఈశ్వర్, మల్లా రెడ్డి, కనుమల్ల సారయ్య,ఇచ్చాంతుల కృష్ణ, ఆశా కార్యకర్తల మండల అధ్యక్షురాలు ఐరెడ్డి తిరుమల, సరిత, శాంత, రమ, విజయ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 12న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయండి…

ఈనెల 12న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయండి

భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులు, చట్టాలను రక్షించుకుందాం. యావత్తు కార్మికుల ఐక్యతను చాటుదాం. దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, ఫిబ్రవరి 12 తేదీ 2026 న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక జాతీయ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఎఐసిసిటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కన్నూరి దనియల్ పిలుపునిచ్చారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి.
కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కొనసాగిస్తూ అమలు చేయాలి.
8 గంటల పని విధానం షరతులు లేకుండా అమలు చేయాలి.
కార్మికులు అంటే బానిసలు కాదు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలి.
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పని భద్రత ఇవ్వాలి.
అభివృద్ధి అంటే కార్పొరేట్ పెట్టుబడుదారులే కాకుండా కార్మికులందరి అభివృద్ధికి ఉపయోగపడాలి. జిబి జి రామ్ జి చట్టం రద్దు చేయాలి.
జాతీయ విత్తన చట్టం రద్దు చేయాలి విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి.బిజెపి ప్రభుత్వం కార్మికుల, ప్రజా వ్యతిరేక విధనాలు ఉపసంహరించుకోవాలి. వారు డిమాండ్ చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version