జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభం…

జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభం…

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి.మండలం. రామచంద్రపురం గ్రామంలో. జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభించడం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీలో భాగంగా ఈరోజు తంగళ్ళపల్లి మండలం. రామచంద్రపురం గ్రామంలో. గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో. గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభించడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ. గ్రామంలో ప్రజలందరికీ జాతీయ ఉపాధి హామీ కార్యక్రమం లో. భాగంగా ప్రజలకు. గ్రామంలో ఉపాధి అవకాశాలు ఉండడంతో ప్రజలకు పని దొరకడం జరుగుతుందని. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకంలో గ్రామీణులకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉండడంతో పాటు ఉపాధి ఉంటుందని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. రామచంద్రపురం గ్రామ సర్పంచ్ గంధం శ్రీనివాస్. ఉపసర్పంచ్ పొన్నాల నర్సింలు. వార్డు మెంబర్లు. గడ్డం లహరి. గంధం లక్ష్మి. గంధం రమేష్. పంతం శేఖర్. పొన్నాల అమృత. గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాకూరిమాధవరెడ్డి. బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల చక్రపాణి. ఫీల్డ్ అసిస్టెంట్ పూర్ణ.చందర్. మరియు ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

వీబీ జి రాంజీ పథకాన్ని వెనక్కి తీసుకోవాలి

ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కన్నూరి దానియేలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కన్నూరి దానియేలు
ఈ సందర్భంగా ఏఐసీటియుజిల్లా కార్యదర్శి కన్నూరి దానియేలు
మాట్లాడుతూ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా 2005 వ సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. 25 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో 100 రోజుల కరువు పనిని ఇప్పుడున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం కుట్ర పొంది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబి జి రామ్ జీ పథకాన్ని పార్లమెంటులో చట్టాన్ని తీసుకువచ్చి బిల్లు ఆమోదించడం జరిగింది. గత 25 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం 90% నిధులతో గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఎంతో గాను ఉపయోగపడే ఉపాధిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇప్పుడు ఈ చట్టంలో 60% నిధుల కేంద్రం 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కొత్త చట్టాన్ని తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి భారం వేస్తుందని తెలిపారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ జాతీయ ఉపాధి పథకాన్ని భూస్వాముల పెత్తందారులకు, బడా బాబులకు అనుకూలంగా పేద రైతు కూలీలకు వ్యతిరేకంగా ఈ పథకం ఉందని అన్నారు. వెంటనే పాత పథకాన్ని అమలులోకి తీసుకురావాలని కొత్తగా తీసుకువచ్చిన వీబి జి రామ్ జి పథకాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version