యాప్ ద్వారా యూరియా కొనుగోలు….

యాప్ ద్వారా యూరియా కొనుగోలు….

◆-: మండల వ్యవసాయ అధికారి వెంకటేశంl

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల (యూరియా) కొనుగోలు ప్రక్రియ నేటి నుండి ప్రారంభమవుతుందని మండలంలోని రైతులు ఫర్టిలైజర్ యాప్ ను ఉపయోగించి అవసరమైన ఎరువులను సులభంగా, పారదర్శకంగా కొనుగోలు చేయవచ్చని ఝరాసంగం మండల వ్యవసాయ అధికారి వెంకటేశం తెలిపారు. ఈ విధానం ద్వారా ఎరువుల సరఫరాలో స్పష్టత, సమయపాలనతో పాటు మధ్యవర్తుల పాత్రను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మండలంలోని అన్ని ఎరువుల డీలర్లు ఈ యాప్ తో అనుసంధానమై ఉన్నారని, రైతులు తమ ఆధార్ నంబర్, రైతు వివరాలతో లాగిన్ అయి ఎరువులు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఫర్టిలైజర్ యాప్ వినియోగ విధానం పై రైతులకు సహాయం అందించేందుకు ప్రతి ఎరువుల డీలర్ వద్ద ఏ ఈ ఓ లను వాలంటీర్లుగా నియమించడం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాప్ ను ఉపయోగించగలరని తెలిపారు. నేటి నుండి ఎరువుల (యూరియా) కొనుగోలు కోసం వచ్చే రైతులు తప్పనిసరిగా తమ ఆధార్ నంబర్ తో పాటు తమ పట్టాదార్ పాస్బుక్ (PPB) నంబర్ను కూడా తీసుకొని రావాలని సూచించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఝరాసంగం మండల వ్యవసాయ అధికారి వెంకటేశం కోరారు.ఝరాసంగం మండలంలో ప్రస్తుతం 560 బ్యాగ్స్ అందు బాటులో ఉందని అన్నారు.

సావిత్రిబాయి పూలే జయంతి.. ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ…

సావిత్రిబాయి పూలే జయంతి.. ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం: భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే నేటితరం ఉపాధ్యాయులకు, మహిళలకు ఆదర్శప్రాయమని, ఆమె అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని ఝరాసంగం ఎంపీడీవో మంజుల, ఎంపీవో స్వాతి, జ్యోతిబా పూలే కళాశాల, ఆదర్శ కళాశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయ ప్రధానోపాధ్యాయులు ప్రిసిల్లా, తేనవతి, నిర్మల పేర్కొన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సావిత్రి బాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version