గ్రామ అభివృద్ధిలో ఉప సర్పంచ్ లు ముందంజలో ఉండాలి..

గ్రామ అభివృద్ధిలో ఉప సర్పంచ్ లు ముందంజలో ఉండాలి

బొట్ల కార్తీక్ (ఉప సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు)

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో భూపాలపల్లి జిల్లా ఉప సర్పంచ్ ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉప సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొట్ల కార్తీక్ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ దేశ అభివృద్ధి కి గ్రామాలే పట్టుకొమ్మలు కాబట్టి గ్రామ అభివృద్ధి లో ఉప సర్పంచ్ లు ముందంజలో ఉండాలని ఈ సందర్బంగా కార్తీక్ కోరారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచ్ లు ప్రత్యేక చొరవ చూపించాలని కార్తీక్ అన్నారు అనంతరం ఉప సర్పంచ్ ల సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ని కార్తీక్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా గౌరవ అధ్యక్షులు ఒద్ది చంద్రయ్య (మహాదేవ్పూర్)
జిల్లా అధ్యక్షులు — గట్టు ప్రదీప్ గౌడ్ (గోరి కొత్తపల్లి)
జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు — బొబ్బిలి రాజు (కొయ్యుర్)
జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెల శంకర్ (రేగొండ)
జిల్లా ఉపాధ్యక్షులు
చమ్మాల సుధీర్ కుమార్ (మహాదేవ్ పూర్)
మొగిలి శంకర్ (ఘనపూర్ ములుగు)
జిల్లా కోశాధికారి — ఆలం స్వర్ణలత (మహాముత్తారం)
జిల్లా సహాయ కార్యదర్శి బుర్ర వెంకటేష్ గౌడ్ (చిట్యాల)
జిల్లా అధికారప్రతినిధి కొండగొర్ల బాణయ్య (కాటారం) ఎన్నికైనారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు ఉపసర్పంచ్ పాల్గొన్నారు

“గ్రామ అభివృద్దే మా లక్ష్యం…

“గ్రామ అభివృద్దే మా లక్ష్యం”.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత నాజియా అంజూమ్ షైక్ సోహైల్ విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుమ్మనపల్లి గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే ప్రతి రూపాయితో తుమ్మనపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు.పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామని, త్వరలోనే గ్రామ సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధి కార్యకలాపాలు చేపడతామని ఆయన అన్నారు.
గ్రామంలోని వార్డుల్లో సిసి రోడ్లు, సైడ్ డ్రెయిన్లు ఏర్పాటు చేస్తామని, అలాగే ప్రతి సింగిల్ ఫేజ్ మోటారు వద్ద ఒక మినీ ట్యాంకర్ ఏర్పాటు చేస్తామని, ముందుగా అత్యవసర పనులను పూర్తి చేస్తామని ఆయన అన్నారు.తుమ్మనపల్లి ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని, గ్రామంలో సమస్యలు లేకుండా అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని ఆయన ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామం అభివృద్ధిలో ముందుంటుందని సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ విశ్వాసం వ్యక్తం చేశారు.గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు అభివృద్ధి విషయాలలో తమకు సహకరించాలని ఆయన కోరారు.ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని ఆయన అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version