ప్రజా బాటలో భాగంగా ఎలక్ట్రికల్ ఏఈ…

ప్రజా బాటలో భాగంగా ఎలక్ట్రికల్ ఏఈ

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

‘ప్రజా బాట’ కార్యక్రమంలో భాగంగా ఝరాసంగం మండలం మేడపల్లి గ్రామంలో ఎలక్ట్రికల్‌ ఏఈ సరళ, సబ్‌ ఇంజినీర్‌ హస్నౌద్దీన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ షాదుల్లా, ఏఎల్‌ఎం శేఖర్‌ పర్యటించారు. గ్రామ సర్పంచ్ కొల్లూరు అరుణ నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు యువ నాయకుడు అభిలాష్ రెడ్డి, ఉప సర్పంచ్ మజార్ అహ్మద్ గ్రామంలోని విద్యుత్ సమస్యలను వారికి వివరించారు. దీనికి స్పందించిన ఏఈ మేడమ్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

బతుకు.. బండి..

బతుకు.. బండి..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా లోని నారాయణఖేడ్,కంగ్జి, వాసర, మనూర్ మండలాల నుంచి జహీరాబాద్ ప్రాంతంలోని ఝరాసంగం, న్యాల్ కల్, కోహిర్, మొగుడంపల్లి, జహీరాబాద్ తదితర ప్రాంతాలకు చెరుకు తరలింపు పనుల కోసం నాలుగు నెలల క్రితం వలస వచ్చారు. చెరుకు పనులు ముగియడంతో ఎడ్లబండ్లపై తమ స్వగ్రామాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. గురువారం ఉదయం ఝరాసంగం మండలం మాచ్నూర్ నుంచి బర్దిపూర్కు వెళ్లే నిన్జ్ రహదారిపై ఎడ్లబండ్లపై కూలీలు వెళ్తుండటం కనిపించింది. “దిశ” వారిని పలకరించగా, నవంబర్ నెలలో కాంగ్జి నుంచి చెరుకు పనుల నిమిత్తం వచ్చామని, ప్రస్తుతం పనులు ముగియడంతో తిరిగి తమ గ్రామాలకు వెళ్తున్నామని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version