మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ సర్పంచ్ కీర్తన ప్రభాకర్
◆-: ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం కప్పా డ్ గ్రమంలో ఈరోజు గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కీర్తన ప్రభాకర్ , ఉప సర్పంచ్ బీరదర్ లక్ష్మి సురేష్ భూమి పూజా నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథులుగా హాజరై,న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ .ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “మహిళా సంఘాల సభ్యులు తమ సమావేశాలను మరియు ఇతర కార్యకలాపాలను సొంత భవనంలో నిర్వహించుకోవడం వల్ల వారి ఆర్థిక, సామాజిక సాధికారత మరింత మెరుగుపడుతుంది. గ్రామ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉంది, ఈ భవనం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే, జహీరాబాద్ ఎంపి సురేష్ శెట్కార్ సహకారంతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని, ప్రజలందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కేతకి డైరెక్టర్ మల్లప్ప పాటిల్,మాజీ సర్పంచ్ నందప్ప పటేల్, కాంగ్రెస్ నాయకులు సంగ్రామ్ పటేల్ వేణుగోపాల్, డప్పుర్ సంగమేష్,శ్రీకాంత్ రెడ్డి,మారుతి రావు పాటిల్, రాజు స్వామి సుభాష్ బసవరాజ్ పటేల్ సయ్యద్ షకీల్ నావజ్ రెడ్ది, రాఘవేందర్ గోపాల్, సంఘమేశ్వర్ వార్డు సభ్యులు మొల్ల మౌలానా మంగలి సుధాకర్, మ్యాతరి మహేష్ గ్రామ సంఘం అద్యక్షురాలు బి. అనిత కార్యదర్శి సూకన్య,వి ఓ ఏ ఖాజా, రాజు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
