“గ్రామ అభివృద్దే మా లక్ష్యం”.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత నాజియా అంజూమ్ షైక్ సోహైల్ విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుమ్మనపల్లి గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే ప్రతి రూపాయితో తుమ్మనపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు.పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామని, త్వరలోనే గ్రామ సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధి కార్యకలాపాలు చేపడతామని ఆయన అన్నారు.
గ్రామంలోని వార్డుల్లో సిసి రోడ్లు, సైడ్ డ్రెయిన్లు ఏర్పాటు చేస్తామని, అలాగే ప్రతి సింగిల్ ఫేజ్ మోటారు వద్ద ఒక మినీ ట్యాంకర్ ఏర్పాటు చేస్తామని, ముందుగా అత్యవసర పనులను పూర్తి చేస్తామని ఆయన అన్నారు.తుమ్మనపల్లి ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని, గ్రామంలో సమస్యలు లేకుండా అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని ఆయన ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామం అభివృద్ధిలో ముందుంటుందని సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ విశ్వాసం వ్యక్తం చేశారు.గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు అభివృద్ధి విషయాలలో తమకు సహకరించాలని ఆయన కోరారు.ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని ఆయన అన్నారు.
