ప్రజా బాటలో భాగంగా ఎలక్ట్రికల్ ఏఈ
జహీరాబాద్ నేతి ధాత్రి:
‘ప్రజా బాట’ కార్యక్రమంలో భాగంగా ఝరాసంగం మండలం మేడపల్లి గ్రామంలో ఎలక్ట్రికల్ ఏఈ సరళ, సబ్ ఇంజినీర్ హస్నౌద్దీన్, లైన్ ఇన్స్పెక్టర్ షాదుల్లా, ఏఎల్ఎం శేఖర్ పర్యటించారు. గ్రామ సర్పంచ్ కొల్లూరు అరుణ నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు యువ నాయకుడు అభిలాష్ రెడ్డి, ఉప సర్పంచ్ మజార్ అహ్మద్ గ్రామంలోని విద్యుత్ సమస్యలను వారికి వివరించారు. దీనికి స్పందించిన ఏఈ మేడమ్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
