రేవంత్.. నిన్ను ప్రజలే పుట్ బాల్ ఆడుతారు: హరీష్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో నూతనంగా గెలిచిన సర్పంచులను.ఝరాసంగం మండల కేంద్ర గ్రామ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ మరియు మాజీ సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు సన్మానించారు, వారితో పాటు జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు మాజీ ఎంపీపీ మాజీ మండల అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్ తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రేవంత్ నువ్వు ఫుట్ బాల్ ఆడుడు కాదు. ప్రజలు నిన్ను ఫుట్ బాల్ ఆడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి” అని విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
