టీమిండియా స్టార్ ప్లేయర్‌కు అస్వస్థత.. ఏమైందంటే…

టీమిండియా స్టార్ ప్లేయర్‌కు అస్వస్థత.. ఏమైందంటే?

 

 

టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మంగళవారం రాజస్థాన్‌తో జరిగిన సూపర్ లీగ్‌ మ్యాచ్ అనంతరం యశస్వి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. అతడిని వెంటనే పుణెలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. స్కాన్ల అనంతరం అతడికి అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్స్(పొట్టలో తీవ్రమైన ఇన్ఫెక్షన్) ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం యశస్వి(Yashasvi Jaiswal) ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కాగా కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
కాగా రాజస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో జైశ్వాల్ అస్వస్థతతో ఉన్నప్పటికీ ముంబై తరపున మైదానంలోకి దిగాడు. బ్యాటింగ్ చేసే సమయంలో అతడు చాలా అసౌక్యరంగా కన్పించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైశ్వాల్ 16 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.

అయినప్పటికీ..

యశస్వి జైస్వాల్(15) విఫలమైనప్పటికీ.. సూపర్ లీగ్ గ్రూప్ బీ మ్యాచులో అజింక్య రహానే(72*), సర్ఫరాజ్ ఖాన్(73) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో రాజస్థాన్ జట్టు ముంబైపై మూడు వికెట్ల తేడాతో ఓడింది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జైస్వాల్ మూడు మ్యాచ్‌లలో 48.33 సగటు, 168.6 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 145 పరుగులు సాధించాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్‌కు ముందు యశస్వీ జైస్వాల్ దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొని 78 సగటుతో 156 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

అభిషేక్ శర్మ విధ్వంసం.. మరో సూపర్ సెంచరీ..

అభిషేక్ శర్మ విధ్వంసం.. మరో సూపర్ సెంచరీ!

 

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 32 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు.

 టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ సెంచరీలతో అదరగొడుతున్నాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బెంగాల్, పంజాబ్ మధ్య హైదరాబాద్ వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో అతడు 32 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. దీంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టపోయి 310 పరుగులు చేసింది. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనే ఇది రెండో అత్యధిక స్కోర్. ఓవరాల్‌గా టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్.
తొలుత టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) 52 బంతుల్లో 148 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. రికార్డ్ స్థాయిలో 16 సిక్సులు, 8 ఫోర్లతో విరుచుపడ్డాడు. ప్రభు సిమ్రన్ సింగ్‌తో కలిసి అతడు మొదటి వికెట్‌కు 205 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రభు(70) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అన్‌మోల్ ప్రీత్ సింగ్(11) నిరాశ పర్చాడు. రమణ్‌దీప్ సింగ్(39), సన్విర్ సింగ్(22) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. నమన్ ధీర్(7), నేహాల్ వధేరా(2) నాటౌట్‌గా నిలిచారు. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, షమీ, ప్రదీప్త ప్రమాణిక్, సాక్షైమ్ చౌదరి తలో వికెట్ పడగొట్టారు.

యువీ సరసన..

అభిషేక్ శర్మ తొలుత 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. తన మెంటార్, క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్(Yuvraj Singh) సరసన నిలిచాడు. టీ20 ప్రపంచ కప్ 2007లో యువీ 12 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేసిన విషయం తెలిసిందే.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version