మ్యానిపెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని నిరసన ప్రదర్శన…

మ్యానిపెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని నిరసన ప్రదర్శన

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే మ్యానిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారం చేపట్టి 18 నెలలు అవుతున్న ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం అంటే కేవలం బీసీ సమాజాన్ని మభ్యపెట్టడం అవుతుంది.ఇప్పటికైనా ఈ అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.అమలు చేయవలసిన
బీసీ అంశాలు..మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ సివిల్ కన్స్ ట్రాక్షన్ మెంటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం,రిజర్వేషన్లు కల్పించాలి.చిరు వ్యాపారులకు విద్యార్థుల ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచి కత్తులేని వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి.బీసీ కార్పొరేషన్లు అలాగే ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలి.అన్ని జిల్లా కేంద్రాలలో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్ ప్రెస్ క్లబ్ స్టడీ సర్కిల్ లైబ్రరీల క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు ఈ ఐక్యత భవనాలలోనే బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాల ఏర్పాటు చేస్తామని అనేక అంశాలను మానిఫెస్టోలో పెట్టి బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించడం అంటే బీసీ సమాజాన్ని మభ్యపెట్టడమే అవుతుంది ఇప్పటికైనా ఈ అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేనిపక్షంలో ఈ అంశాలను బీసీ సమాజం దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందట దోషిగానిలబెడతామనిహెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్
రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకన్న,జిల్లా కార్యదర్శి శాఖ పురం భీమసేన్,ఏదునూరు రమేష్,కీర్తి బిక్షపతి,చంద్రగిరి చంద్రమౌళి,రంగు అశోక్,గుండా రాజమల్లు,వేముల అశోక్,ఆరెందుల రాజేశం, అంకం సతీష్,జక్కం పూర్ణచందర్,తదితరులు నాయకులు పాల్గొన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి

కొండా చరణ్ బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు

నేటిధాత్రి చర్ల

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలలో 42 శాతం బీసీ బిల్లును ఆమోధించి 9వ షెడ్యూల్ లో చేర్చాలని బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండా చరణ్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ను ఆమోధించి 9 షెడ్యూల్ లో పెట్టాలని కొండా చరణ్ కేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేసారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు వాక్యాలు ను ఖండిస్తూ బీసీ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అని వారు తెలిపారు
బీసీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలనీ మహిళా రిజర్వేషన్ లలో బీసీ కోటను అమలు చేయాలి
మండల్ సిపార్సులను వెంటనే అమలు చేయాలి
చట్ట సభల్లో విద్య ఉద్యోగం లలో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలనీ 50 శాతం నిధులతో బీసీ సబ్ ప్లాన్ ను దేశ వ్యాప్తంగా అమలు చేయాలి ఈ డబ్ల్యు ఎస్ రిజర్వేషన్ ను రద్దు చేయాలనీ
కొండా చరణ్ పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేసారు తెలంగాణ బీజేపీ ఎంపి లు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు ను అమోదించే విధంగా బాధ్యత తీసుకోవాలి అని లేకపోతె తెలంగాణ బీజేపీ నాయకులు బీసీ సమాజం ముందు దోషిగా మిగిలిపోతారు అని తెలిపారు

మాదిగ,ముదిరాజులను మంత్రి వర్గంలోకి తీసుకోవాలి.

మాదిగ,ముదిరాజులను మంత్రి వర్గంలోకి తీసుకోవాలి

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు పాముల రమేష్.

హన్మకొండ,నేటిధాత్రి:

తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ, ముదిరాజ్ సామాజిక వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని
హన్మకొండ జిల్లా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు
పాముల రమేష్ కోరారు.ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ,కాంగ్రెస్ జాతీయ నాయకులకు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు విజ్ఞప్తి చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలను అదేవిధంగా ముదిరాజులను 10 సంవత్సరాల పాటు రాజకీయ వివక్షతకు గురిచేస్తూ అణగదొక్కడం జరిగిందన్నారు. మతోన్మాద బిజెపి పార్టీశక్తులు పావులుగా మార్చుకునే వారి కుట్రలను గమనిస్తున్నాం.బిజెపి పార్టీ 1996లో కాకినాడలో వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఆ విషయాన్ని తుంగలో తొక్కిందన్నారు.గత శాసనసభ ఎన్నికల ముందు క్యాబినెట్ సెక్రెటరీతో హడావిడిగా ఎస్సీ వర్గీకరణ కమిటీ వేసి ఇప్పటివరకు రిపోర్టు తెప్పించలేదని తెలిపారు.బిజెపి పార్టీ మాదిగల పట్ల, ముదిరాజుల పట్ల ప్రేమ ఉంటే ఆ సామాజిక వర్గాల నుంచి కేంద్ర మంత్రులుగా తీసుకోవాలని రమేష్ డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version