వినాయక మండపాల ఏర్పాటు సమాచారం పోలీస్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి ఎస్సై జాడి శ్రీధర్

వినాయక మండపాల ఏర్పాటు సమాచారం పోలీస్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి

ఎస్సై జాడి శ్రీధర్

జైపూర్,నేటి ధాత్రి:

 

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా,జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులు, పోలీస్ పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా విగ్రహాల ఏర్పాటు కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేయాలని జైపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపారు.
https://policeportal.tspolice.gov.in/index.htm ఆన్లైన్ లింక్ ను క్లిక్ చేసి అందులో దరఖాస్తు దారుని వివరాలు,విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం,ఏ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.విగ్రహం ఎత్తు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం ఎత్తు,కమిటీ సభ్యుల పేర్లు వారి ఫోన్ నెంబర్లు,విగ్రహం ప్రతిష్టించే రోజు,నిమజ్జనం చేసే తేదీ సమయం,ప్రదేశం,ఆ ప్రదేశానికి ఏ వాహనంలో చేరుకుంటారు.అన్ని వివరాలు మండప నిర్వహకులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు,వాలంటీర్ల వివరాలు,ఫోన్ నెంబర్లు చిరునామా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా వివరాల నమోదుకి సంబంధించి ఏవైనా సందేహాలుంటే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణకు ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో అప్రమత్తంగా ఉంటుందని,శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్న వెంటనే డయల్ 100 డయల్ 112 ను సంప్రదించాలని తెలియజేశారు.మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించే వారు సామరస్యపూర్వక వాతావరణం లో , శాంతియుతంగా ఉత్సవాల నిర్వహణకు పోలీస్ శాఖ కి సహకరించాలని కోరారు.
ఇంతకు మునుపు వినాయక మండపం ఏర్పాటు చేసినటువంటి,ఎలాంటి వివాదాస్పదం కాని ప్రదేశంలో మాత్రమే మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలని, విద్యుతు ప్రమాదాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,స్త్రీలకు చిన్నపిల్లలకు ప్రత్యేకమైన క్యూలైన్లు నిర్వహించి వారిని గౌరవించాలని,వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మండపాల నిర్వహకులకు ఎస్సై శ్రీధర్ సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version