మంత్రికి వినతి పత్రం ఇచ్చినవిద్యార్థి యువజన సంఘాలు…

మంత్రికి వినతి పత్రం ఇచ్చినవిద్యార్థి యువజన సంఘాలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ కళాశాల హాస్టల్ కు మంత్రి అడ్లూరీ లక్ష్మణ్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పర్యటించారు. రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన పై వారు విద్యార్థులతో మాట్లాడిన అనంతరం భూపాలపల్లి జిల్లా విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డిఐవైఎఫ్ ప్రజా సంఘాలు మంత్రికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నేరెళ్ల జోసెఫ్,వేముల శ్రీకాంత్, భూక్యా నవీన్ నాయకులు మాట్లాడుతూ వరుసగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు తరచూ ఫుడ్ పాయిజనింగ్, విద్యార్థినిలపై దాడులు, కరెంటు షాక్ ఇతర సంఘటనల వల్ల అధికారుల లోపం స్పష్టంగా కనబడుతుందని తెలిపారు. కేవలం జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లనే తరచూ ఇలాంటి ఘటన జరుగుతూ విద్యార్థులు ఆవేదన గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను కేటాయించినప్పటికీ ఎవ్వరు కూడా నెలలో కనీసం ఒక్కరోజు కూడా హాస్టలకు రాకపోవడం, వారి సమస్యలు తెలుసుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని అధికారులు,విద్యార్థి యువజన సంఘాలతో కమిటీ వేసి ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. జిల్లాలో వారానికి ఒకసారైనా కలెక్టర్ ప్రతి ప్రభుత్వ హాస్టల ను పర్యటించాలని డిమాండ్ చేశారు.

కస్తూర్బా బాలికల హాస్టల్ లో సమస్యలు పరిష్కరించాలి.ABVP నాయకులు…

కస్తూర్బా బాలికల హాస్టల్ లో సమస్యలు పరిష్కరించాలి.ABVP నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం కస్తూర్బా బాలికల హాస్టల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిపై స్పందించి సమస్యలు పరిష్కరించాలని. ABVP. జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేస్తూ నిరసనవ్యక్తం. చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూజ్యం కార్తీక్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ పలు సమస్యలపై హాస్టల్ ప్రిన్సిపల్.కి పలు సమస్యలు విన్నవించగాదురుసుగా మాట్లాడిందనిఈరోజు ఏబీవీపీ .నాయకులు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూఅదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు మరియు పిల్లలు కూడా ప్రిన్సిపాల్ కిసమస్య ఉందని చెప్పినప్పటికీ కూడా నాకెందుకు చెప్తున్నారు అని దురుసుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు అదేవిధంగా ఏబీవీపీ నాయకులు వెళ్లి సమస్య ఏంటి మేడం అని అడిగితే మీరు నిజంగా ఏబీవీపీ నాయకులు మీ దగ్గర కార్డు ఉందా లేదా లెటర్ ఉందా అంటూ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిందనీ విద్యార్థి నాయకులు అన్నారు. అదేవిధంగా హాస్టల్ లోపల బాలికలకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ అదేవిధంగా డిఓగారిని ఈరోజు వారిని కలిసి తెలియజేశారు లేనిపక్షంలో ఇదే హాస్టల్.ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో. ABVP .హాస్టల్ జిల్లా కన్వీనర్ పూజ్యం.కార్తీక్. నాయకులు ధనుష్ చరణ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version