ప్రజాసాక్షి దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన తహసీల్ధార్ శ్రీనివాస్
ప్రభుత్వ వైద్యురాలు వాహిని
మల్లాపూర్ ఫిబ్రవరి 03నేటి దాత్రి
వార్తా పత్రికలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలాగ పని చేస్తాయని మండల తహసీల్ధార్ శ్రీనివాస్ అన్నారు. ఆయన మండల కేంద్రంలోని తహసీల్ధార్ కార్యాలయంలో ప్రజాసాక్షి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించి అభినంధనలు తెలియజేసారు.
మండల ప్రభుత్వ వైద్యురాలు వాహిని మాట్లాడుతూ తన ద్వార ప్రజాసాక్షి క్యాలెండర్ ఆవిష్కరించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
ఇట్టి కార్యక్రమంలో తహసీల్ధార్ శ్రీనివాస్ , ప్రభుత్వ వైద్యురాలు వాహిని, సూపర్ వైజర్ రాంమోహన్ ,హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ , నర్సింగ్ ఆఫీసర్ ఉమాదేవి, వార్త దినపత్రిక ప్రతినిధి రాంప్రసాద్ , నేటి ధాత్రి దినపత్రిక ప్రతినిధి ఎస్ పి రమణ, అక్షర వేధం దిన పత్రిక ప్రతినిధి జరుపుల రమేష్ , కాంగ్రెస్ నాయకులు గంధం రాజేష్ , ప్రజాసాక్షి దినపత్రిక ప్రతినిధి వంగ రాజశేఖర్ పాల్గొన్నారు.
