వసతి గృహాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి ఇందిరా

వసతి గృహాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి ఇందిరా

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగముగా సంక్షేమ వారోత్సవాలు సందర్భంగా సంక్షేమ వసతి గృహాలలో పారిశుద్ధ్య నిర్వహణ (వంటశాలలు, స్నానపు గదులు, మారుగుదొడ్లు) నోడల్ అధికారి ఇ ఇందిర, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి, సంక్షేమ వసతి గృహాలలో తనికీలు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసతి గృహాలలో వంటశాలలు పరిశుభ్రంగా ఉంచాలి పిల్లల ఆరోగ్య విషయంలో హాస్టల్స్ వార్డెన్స్ తాగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

దుగ్గొండి ఎమ్మార్వోగా ముస్కు సమ్మక్క బాధ్యతలు…

దుగ్గొండి ఎమ్మార్వోగా ముస్కు సమ్మక్క బాధ్యతలు

దుగ్గొండి, నేటిధాత్రి:

దుగ్గొండి మండలం ఎమ్మార్వోగా మూసుకు సమ్మక్క బాధ్యతలు చేపట్టారు.
ఆమె గతంలో హనుమకొండ కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్నది.కాగా ఇటీవల జరిగిన తాహసిల్దార్ ల బదిలీల నేపథ్యంలో దుగ్గొండి మండల తహసిల్దార్ నియమితులయ్యారు. బుధవారం ఎమ్మార్వో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టగా కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా స్థానిక జర్నలిస్టులు, వివిధ రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు నాయకులు ఆమెను కలిసి అభినందించారు.

ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్…

ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

 

 

ప్రజా పాలన–పట్టణ ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం నర్సంపేట ఎమ్మార్వో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. కార్యాలయం,పరిసరాలు,రికార్డులకు సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా తహసీల్ కార్యాలయంలో నిర్వహణలో ఉన్న రికార్డులు, కార్యాలయ పరిసరాలు, ప్రజలకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ సమీక్షించారు. రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలన్నారు.

అదేవిధంగా 99 రోజుల కార్యక్రమం అమలు తీరును పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలను వేగవంతంగా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. ప్రజల వినతులను ఆలస్యం చేయకుండా పరిష్కరించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ లో పాల్గొన్న టీఎన్జీవో నాయకులు…

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ లో పాల్గొన్న టీఎన్జీవో నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత జిల్లా కార్యాలయలలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా ఐడిఓసి లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు డీసీపీ భాస్కర్,అడిషనల్ కలెక్టర్ (రెవేన్యూ) పి.చంద్రయ్య పాల్గొని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు.తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం లో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు,మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్,మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి,రామ్ కుమార్,కార్యవర్గ సభ్యులు కుమార్,గంగారం,తదితరులు పాల్గొన్నారు.అనంతరం మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ప్రజా పాలనలో ప్రభుత్వం తెచ్చే ప్రతి పధకం ప్రజలకు చేరవేయడానికి నిరంతరం టీఎన్జీవో ఉద్యోగులు ముందు ఉంటారని తెలంగాణ రైజింగ్ 2047 లో భాగంగా తెలంగాణలోని ప్రతి నాన్ గెజిటెడ్ ఉద్యోగి,టీఎన్జీవో యూనియన్ నిరంతరం కష్టపడి తెలంగాణ అభివృద్ధికి కృ

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version