ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్…

ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

 

 

ప్రజా పాలన–పట్టణ ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం నర్సంపేట ఎమ్మార్వో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. కార్యాలయం,పరిసరాలు,రికార్డులకు సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా తహసీల్ కార్యాలయంలో నిర్వహణలో ఉన్న రికార్డులు, కార్యాలయ పరిసరాలు, ప్రజలకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ సమీక్షించారు. రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలన్నారు.

అదేవిధంగా 99 రోజుల కార్యక్రమం అమలు తీరును పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలను వేగవంతంగా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. ప్రజల వినతులను ఆలస్యం చేయకుండా పరిష్కరించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version