పరకాలలో ఆశ వర్కర్ ల భారీర్యాలీ
తమకిచ్చిన హామీలను నెరవేరర్చాలని డిమాండ్
పరకాల,నేటిధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో ఆశవర్కర్ లకు సంబందించిన హామీలు ఏఒక్కటి నెరవేర్చలేదని మరియు అసెంబ్లీ సమావేశాలలో ఆశాలకు సంబంధించి ఎలాంటి చర్చ లేఖపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్టియు ఆశ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి మంజుల ఆధ్వర్యంలో పట్టణంలో పరకాల,నడికూడా మండలాల పరిధిలోని ఆశ వర్కర్లతో కలిసి అంబేద్కర్ విగ్రహం నుండి బస్టాండ్ కూడలి వరకు నల్ల బ్యాడ్జిలు ధరించి భారి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా మేనిఫెస్టో లో పెట్టిన ప్రకారం వేతనం 18వేలు చెల్లించాలని ఉద్యోగ భద్రత,ప్రమాధ భీమా,1000 మంది జనాభాకు ఒక ఆశాను నియమించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యాడ ప్రేమలత,పిహెచ్సీ అధ్యక్షురాలు సునీత,రమాదేవి,లావణ్య,శైలజ,అనిత,స్వప్న,విజయ,సుజాత,పి.సునీత,వనమాల,కవిత,స్వరూప తదితరులు పాల్గొన్నారు.
