మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బానోతు సారంగపాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యూత్ నాయకుడు ఎర్ర సుమన్ తండ్రి మోహన్ రెడ్డి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్తివదేహంపై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, నాయకులు లే0కాలసాయిలు, చల్ల రాజన్న, మెరుగు రాజు, చిన్నాల మల్లేష్, కడుదూరీ సురేందర్, కూ స కళింగ రాజు, లింగయ్య, చంద్రమౌళి, రవి తదితరులు ఉన్నారు.
