కరకగూడెంలో ఘనంగా మహాత్మా గాంధీ 78వ వర్ధంతి

ఘనంగా మహాత్మా గాంధీ గ 78వ వర్ధంతి.

కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.,నేటిధాత్రి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామంలో జాతి పిత మహాత్మా గాంధీ గారీ 78వ వర్ధంతి సందర్భంగా గాంధీ స్మారక కరకగూడెం మేనేజర్ నాగ బండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొని జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేనమరియు సర్పంచ్ పోలేబోయిన సుజాత.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
అహింసా అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన సమరయోధుడు యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రధాత జాతిపిత మహాత్మా గాంధీ , ఆయన చూపిన శాంతియుత మార్గం ద్వారానే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీజీ అని కొనియాడారు.
భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, గాంధీజీని విడదీసి చూడలేం, అలాంటి మహాత్ముడి జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు..
ఈ కార్యక్రమంలో
గ్రామ పెద్దలు కొంపెల్లి రామలింగం గారు, చిట్టి ప్రసాద్ , గొగ్గలి రవి , షేక్ రఫీ , తిప్పని శ్రీను , ప్రజా ప్రతినిదులు, రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రముఖులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, గ్రామస్తులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version