నేటి నుండి నాగులమ్మ మహా జాతర…

నేటి నుండి నాగులమ్మ మహా జాతర

ఆదివాసీ పూజారులు ,వడ్డే లతో ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు

నాగులమ్మ ను తర తరాలుగా ప్రకృతి దేవత గా ఆరాధిస్తున్న ఆదివాసీ పూజారులు

మార్చ్ 5 న నిండు జాతర,నాగులమ్మ-పగిడిద్ద రాజు ల కళ్యాణం,అగ్నిగుండాలు

అలరించనున్న ఆదివాసీ దింసా,గుస్సాడి నృత్యాలు

కార్య క్రమాలను వెల్లడించిన బాడిశ రామకృష్ణ స్వామి

మంగపేట:నేటిధాత్రి

 

మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధి లో గల లక్ష్మీ నర్సా పూర్ గ్రామం లో శ్రీ నాగులమ్మ మహా జాతర ఐదు రోజుల పాటు గిరిజన ఆదివాసీ సాంప్రదాయ బద్ధం గా ఘనం గా నిర్వహించ నున్నారు .ప్రతి రెండేళ్ల కోసారి పాల్గుణ శుద్ధ పౌర్ణమి ఉన్న వారం లో జాతర నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీ గా వస్తుంది.పూజ కార్య క్రమ వివరాలను బాడిశ.రామకృష్ణ స్వామీజీ తెలియ జేసారు.మార్చ్ 03 న మండె మెలుగుట కార్యక్రమం తో జాతర ప్రారంభ

మవుతుందని,మార్చ్ 4న బుధవారం శ్రీ నాగులమ్మ అమ్మవారిని గండోర్రె గుట్ట వద్ద ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు,అదేసమయంలో యెర్రెట్టల గుట్ట వద్ద సడాలమ్మకు పూజలు చేసి నాగులమ్మ సడాలమ్మ అమ్మవార్లను రమణక్క పేట దగ్గర వున్న గోదావరి నది వద్ద పుణ్య స్నానాలు చేసి నాగులమ్మ ఆలయం వద్ద కు తీసుకు వొచ్చి ప్రతిష్టిస్తారు.మార్చి 5 న నిండు జాతర.అందులో భాగంగా సాయంత్రం 3 గంటలకు రాజుపేట సెంటర్ నందు పాలమాకు వొర్రె నుండి తీసుకువచ్చిన కంక వనం(వనదేవత) కు శ్రీ నాగులమ్మ అమ్మవారికి ఎదురుకోలు కార్య క్రమాన్ని నిర్వహిస్తారు.

రాత్రి 12:05 నిమిషాలకు శ్రీ నాగులమ్మ అమ్మవారికి పగిడిద్ద రాజులకు కళ్యాణాన్ని యాశాస్త్రోక్తం గా గిరిజన ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తారు.జాతర లో ముఖ్య ఘట్టం అగ్నిగుండాల కార్యక్రమం.తెల్ల వారు జామున 3 గంటల సమయం లో నాగులమ్మ తల్లి ఉపాసకులు బాడిశ రామకృష్ణ స్వామి లోక కళ్యాణం

కోసం అగ్ని గుండాలలో నడవడం జరుగుతుంది.మార్చి 6 న అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుట జరుగుతుందని,మార్చి 7 న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడం జాతర ముగుస్తుందని తెలిపారు.

బడంపేటలో అంగరంగ వైభవంగా రాచన్న స్వామి జాతర…

బడంపేటలో అంగరంగ వైభవంగా రాచన్న స్వామి జాతర

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేటలో రాచన్న స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా కార్యనిర్వాహణ అధికారి విభూతి శివరుద్రప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్ద సోమవారం ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, భక్తిశ్రద్ధలతో అగ్నిగుండం తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతరలో భక్తుల కోలాహలం నెలకొంది.

కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం…

కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 3వ రోజైనా సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వారికి మేల్కొల్పు సేవ, సుప్రభాత సేవ, రుద్రాభిషేకం నిర్వహించారు.అనంతరం మహా మంగళహారతి విశేష పూజల అనంతరం మంగళ వాయిద్యాల, పురం‌తుల దండకాలు మధ్య పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను పల్లకిలో తీసుకెళ్లి వైదిక క్రతువులు, శాస్త్రోక్తంగా వేదమంత్రాల నడుమ సకల దేవతలను ఆహ్వానించి అగ్నిదేవునికి పూజలు నిర్వహించి అగ్నిగుండ ప్రవేశాన్ని ప్రారంభించారు.అనంతరం భారీగా తరలివచ్చిన భక్తులు “ఓం నమః శివాయ.. హర హర మహాదేవ” అనుకుంటూ అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం, స్వామి వారి రథోత్సవ కార్యక్రమానికి దేవాలయ ధర్మాదాయ శాఖ, పోలీసు వారు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.a

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version