బడంపేటలో అంగరంగ వైభవంగా రాచన్న స్వామి జాతర
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేటలో రాచన్న స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా కార్యనిర్వాహణ అధికారి విభూతి శివరుద్రప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్ద సోమవారం ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, భక్తిశ్రద్ధలతో అగ్నిగుండం తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతరలో భక్తుల కోలాహలం నెలకొంది.
