ఎస్సీ లోన్ల గడువు పెంపు డిమాండ్

ఎస్సీ కార్పొరేషన్ లోన్ల గడువు పొడిగింపు చేయాలి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల మండల కేంద్రంలో ఎంపీడీవో ఎల్ భాస్కర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది
అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్
గ్రామ కమిటీ అధ్యక్షుడు తిక్క సంపత్ రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎస్సీ కులస్తులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలకు ఈనెల 24 వరకు ఉన్నాయి కానీ దానికి సంబంధించి ఎస్సీ కులస్తులు అర్హులైన వారు కులం ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరి కాబట్టి రెవెన్యూ కార్యాలయం నుండి సర్టిఫికెట్లు అందక రాష్ట్ర జిల్లా మండల వ్యాప్తంగా ఎక్కువమంది తీసుకోలేదు అలాగే ఎస్సీ కులాల కు ఎక్కువ మంది ఉన్నందున అదనంగా యూనిట్లు పెంచాలని
దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 24 వరకు ఉన్నందున దానిని భారత రాజ్యాంగ రచయిత ప్రపంచమైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు పొడిగించి అర్హులైన ఎస్సీ కులస్తుల అందరికీ అలాగే అదనంగా యూనిట్లు పెంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింద

సబ్సిడీ రుణాల గడువు పెంచాలని డిమాండ్

సబ్సిడీ రుణాల గడువును పెంచాలి

తెలంగాణ మాదిగ జర్నలిస్టులఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్

పరకాల,నేటిధాత్రి

 

రాష్ట్ర వ్యాప్తంగాఎస్సీ కులస్తులకు జీవనోపాధి కల్పించి వారి అభివృద్ధి చెందుటకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందించుటకు ఈనెల 24 వరకు ఉన్న గడువును అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు పొడిగించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టులఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్ అన్నారు.వ్యాపారానికి సంబంధించిన యూనిట్లను కూడా ప్రవేశపెట్టి ఎక్కువ యూనిట్లను పెంచాలని దరఖాస్తు చేయడానికి కులము,ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరి కాబట్టి రెండు రోజులు సెలవులు ఉండడం వలన రెవెన్యూ కార్యాలయం నుండి సర్టిఫికెట్లు అందక చాలామంది కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేయలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ ఆలోచన చేసి గడువు తేదీని పొడగించాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version