కర్ణాటక బస్సుల పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్స్ లో ఆధ్వర్యంలో ఎంవీఐ కి వినతి పత్రం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: టికెట్ పై ఉన్న నెంబర్ కు వస్తున్న బస్సులకు సంబంధం లేనీ కర్ణాటక బస్సుల పై చర్యలకే కై డివైఎఫ్ఎ లో ఆధ్వర్యంలో జహీరాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.సోమవారం డివైఎఫ్ ఐ పట్టణ కమిటీ కార్యదర్శి జే శ్రీకాంత్ మాట్లాడుతు… కర్ణాటక ప్రాంతం నుండి జహీరాబాద్ గుండా హైదరాబాద్ మహా నగరం కు వెళ్ళే కర్ణాటక బస్సులు ప్రయాణికులకు ఇస్తున్న టికెట్ పై ఉన్న బస్సు నెంబరుకు బస్సు పై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్కు సంబంధం లేకుండా బస్సులు నడపడం సరైనది కాదని దీంతో ఏదైనా ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఇలాంటి బస్సులు నడుపుతున్న కర్ణాటక బస్సులపై చర్యలు తీసుకోవాలని ప్రతి బస్సు ను చెకింగ్ చేసి, వాటిని వెంటనే సీజ్ చేయాలని అన్నారు.
