కాంగ్రెస్ ఇది ప్రజా పాలన కాదు వాయిదా పాలన.
భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి
* ఈ ప్రభుత్వం ఏ పని మొదలుపెట్టిన మధ్యలోనే ఆపేస్తున్నారు
* రైతు రుణమాఫీ మధ్యలోనే ఆపారు
యూరియా సకాలంలో రాలేదు
ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అన్ని గ్రామాలకు రాలేదు
రాజీవ్ యువశక్తి మొదలే పెట్టలేదు
మహిళలకు 2500 రానేలేదు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ధర్మ సమాజ్ పార్టి భూపాలపల్లి జిల్లా ప్రదాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీ.సీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హడావిడిగా ఎన్నికలు నిర్వహించుటకు సిద్ధమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టి న్యాయం చేస్తే మేం స్వాగతిస్తాం. కానీ న్యాయ నిపుణులతో చర్చించకుండా?సాధ్య , అసాధ్యాయులు అంచనా వేయకుండా? ఎన్నికల జీ.వో తీసుకురావడాన్ని హైకోర్టు స్టె ఇచ్చింది. దీనివల్ల ప్రజలు అధికారులు అసహనానికి గురవుతున్నారు. ప్రజాధనం వృధా అవుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. అసమర్థ పాలనతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇది ప్రజా పాలన కాదు వాయిదా పాలన? అని విసిగిపోతున్నారు. ఏ పని మొదలుపెట్టిన మధ్యలోనే ఆపేస్తున్నారు. రైతు రుణమాఫీ అందరికి జరగలేదు. యూరియా సకాలంలో రాలేదు. రాజీవ్ యువ శక్తి లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అన్ని గ్రామాలకు అందలేదు. బతకమ్మ చీరలు లేవు. సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ప్రజలకు అవసరమైన ఆయకట్టు రోడ్లు లేవు. అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుటకు కారణం మేధావులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం సమర్థవంతమైన నిర్ణయం తీసుకోక పోవడమే ఇప్పటికైనా సంపూర్ణ పరిపక్వ నిర్ణయాలతో ప్రజలకు సేవ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ప్రభుత్వానికి సూచించారు.
