అక్రమ కేసు లకు భయపడేది లేదు…

అక్రమ కేసు లకు భయపడేది లేదు

గుండాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్

గుండాల,నేటిదాత్రి:

 

మణుగూరు పట్టణం లో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ భవనం అని పిలవబడే కార్యాలయం పైన జరిపిన దాడిని కండిస్తూ బిఆర్ఎస్ మండల నాయకులు మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదం గా ఉన్నాయని గుండాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్ అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచి తర్వాత వారి స్వలాభం కోసం గులాబీ కండువా కప్పుకుని తల్లి పాలు తాగి రొమ్ము మీద తన్నిన మాదిరి నీ గెలుపుకి కారణమయిన కాంగ్రెస్ పార్టీ కి సంబందించిన కార్యాలయాన్ని కబ్జా చేసి బిఆర్ఎస్ భవన్ గా మార్చుకున్న మీ నాయకుడా ఈ దాడిని ఖండించేది. ఏ అధికారం లేని నాడు కూడా మా పార్టీ కార్యాలయం మాకు కావాలని పోరాడిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే సొంతం, అధికారం ఉన్నా లేకున్నా ఆ భవనం కాంగ్రెస్ పార్టీ కి మాత్రమే సొంతం, అయిదేండ్లుగా మా భవనాన్ని మాకు లేకుండా చేసి మా ఓపిక ను పరీక్షించిన మీకు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం అంతా కలిసి బుద్ధి చెప్పే కార్యక్రమం నిర్వహించాం, మీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే వారి కార్యాలయాన్ని నాడు కబ్జా చేసుండకపోతే నేడు ఈ పరిస్థితి మనకు రాకుండేది గా అని మీ నాయకుడ్ని ప్రశ్నించండి అని మొదట ఆజ్యం పోసిందే మీ నాయకుడు కదా అని ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి కేసులకు భయపడేది లేదని మా భవనాన్ని మేము స్వాదీన పర్చుకోవడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్, యువజన నాయకులు వాజీద్ పాషా, ఇస్రార్, బొంగు చంద్రశేఖర్, పల్లపు రాజేష్ సోషల్ మీడియా నాయకులు మండలోజు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

పీఎస్ఆర్,పీవీఆర్ యువసేన అధ్యర్యంలో పొంగులేటి జన్మదిన వేడుకలు…

పీఎస్ఆర్,పీవీఆర్ యువసేన అధ్యర్యంలో పొంగులేటి జన్మదిన వేడుకలు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

మండలం కేంద్రంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణా సంచా పేల్చి ఘనంగా పొంగులేటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దార అశోక్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ గ్రామం నుండి అయినా అన్న అని ఒక పిలుపు ఇస్తే నేను ఉన్న అని అభయం ఇచ్చే నాయకుడు మన పొంగులేటి శ్రీనన్న అని ఆయన ఆధ్వర్యంలో మరెన్నో అభివృద్ధి పనులు జరగాలని ఆశిస్తూ ఇలాంటి జన్మ దిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జీవితం లో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు.
ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటుగా తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఏఏంసి డైరెక్టర్ ఊకే బుచ్చయ్య, ఎస్ కే వాజీద్ పాషా, ఎస్కె కాసీం, నునావత్ రవి,బొంగు చంద్రశేఖర్, పల్లపు రాజేష్, గడ్డం రాజేష్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version