వార్డ్ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి…
ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి మినుగు ముని
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డ్ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్, సిపిఐ పార్టీలు బలపరిచిన సిపిఐ కౌన్సిలర్ అభ్యర్థి మినుగు ముని అంటున్నారు. గద్దె రాగడి ఏరియాలోని కాలనీలలో గడపగడపకు ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు.ఎనిమిదవ వార్డు ప్రజలు అవకాశం ఇస్తే కాలనీలలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. స్థానిక బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అలుగుల శ్రీలత- సత్తయ్యలు సైతం కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుండడంతో గెలుపు లాంచనమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రచార కార్యక్రమంలో మేరుగు రాజేశం, కుర్మ గురువయ్య, దినేష్, దేవి సాయి కృష్ణ, రాజ్ కుమార్, శ్రీనివాస్, వంశీ, రాజేందర్, సాంబయ్య, మనోహర్, రమేష్, మొండయ్య, హరీష్ లు పాల్గొన్నారు.
