అవినీతి సునీల్ రావుకు ప్రజలే గుణపాఠం

అవినీతి అనకొండ సునీల్ రావును ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయం- వెలిచాల

వెలిచాల సమక్షంలో నూటయాభై మందితో కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ రాజన్న గౌడ్

కరీంనగర్, నేటిధాత్రి:

 

ప్రపంచంలోనే ఎక్కడా లేని భయంకరమైన అవినీతి అనకొండ సునీల్ రావును ఆ డివిజన్ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. మేయర్ గా ఉన్న సమయంలో వందలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ప్రజలను పీడించి దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇల్లు కట్టాలన్న అపార్ట్మెంట్ నిర్మించాలన్న షాపు పెట్టుకోవాలన్నా సునీల్ రావు డబ్బులు దండుకునేవారని ప్రజలే బహిరంగంగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. అలాంటి ఆవినీతి ఆనకుండా సునీల్ రావును డివిజన్ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించబోతున్నారని పేర్కొన్నారు. గురువారం కొత్తపెళ్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో 42వ డివిజన్ కు చెందిన పశుసంవర్ధక శాఖ రిటైర్డ్ జిల్లా అధికారి డాక్టర్ పంజాల రాజన్న గౌడ్ నూటయాభై మంది డివిజన్ ప్రజలు, మహిళలు యువకులతో కలిసి వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. డాక్టర్ రాజన్న గౌడ్ కు రాజేందర్రావు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేందర్రావు మాట్లాడుతూ 42వ డివిజన్ కు చెందిన రాజన్న గౌడ్ నీతికి నిజాయితీకి మారుపేరని విద్యార్థి నేతగా ఉన్న సమయంలో అలుపెరగని ప్రజా పోరాటం చేశారని పేర్కొన్నారు. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు. పశుసంవర్ధక శాఖలో ఉన్నతాధికారీగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. దాదాపు నలబై సంవత్సరాలు పాటు అధికారిగా అత్యుత్తమ సేవలందించారని రాజేందర్రావు పేర్కొన్నారు. అలాంటి రాజన్న గౌడ్ తన ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఏసాయం కావాలన్నా అర్ధరాత్రి అర్ధరాత్రి వెన్నంటే ఉండే సాయం అందించే మనస్తత్వం కలిగిన వ్యక్తి డాక్టర్ రాజన్న గౌడ్ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో రాజన్న గౌడ్ కు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో రాజన్న గౌడ్ కు అత్యంత గౌరవం ఇస్తామని పేర్కొన్నారు. భయంకరమైన అవినీతి అనకొండ మాజీ మేయర్ పై నీతిగా నిజాయితీగా వ్యవహరించే రాజన్న గౌడ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. మాజీ మేయర్ సునీల్ రావు వందలాదికోట్లు ప్రజలను పీడించి అక్రమంగా సంపాదించారని చరిత్రలో భయంకరమైన అవినీతి ఆనకొండ ఎక్కడా లేరని రాజేందర్రావు మండిపడ్డారు. సునీల్ రావు అవినీతినీ చరిత్రలో చెరిపి వేయలేమని అంతా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పట్టణ ప్రజల అసహ్యించుకుంటున్నారని చిత్కరిస్తున్నారని అలాంటి వ్యక్తికి తగిన గుణపాఠం ప్రజలు చెప్పబోతున్నారని రాజేందర్రావు పేర్కొన్నారు. అలాంటి సునీల్ రావును డివిజన్ ప్రజలు ఘోరంగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 42వ డివిజన్ లో అవినీతికి నీతికి మధ్య పోటీ జరుగుతున్నదని నీతిగా నిజాయితీగా వ్యవహరించే రాజన్న గౌడ్ ను ప్రజలు గెలిపించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నగరపాలక సంస్థ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేస్తున్నామని రాజేందర్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ రాజన్న గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ఎనలేని గౌరవం ఇష్టమని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా పశు సమర్ధక శాఖలో అధికారిగా పని చేశానని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. డివిజన్ ప్రజలను పట్టిపీడించిన వ్యక్తి సునీల్ రావ్ అని ఆయనను ఓడించేందుకు డివిజన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. సునీల్ రావు అవినీతిని అడ్డుకునేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని పేర్కొన్నారు. వెలిచాల రాజేందర్రావు మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని రాజన్న గౌడ్ తెలిపారు. 42వ డివిజన్ ప్రజల ఆశీర్వాదం అండదండలతో కార్పొరేటర్ గా మంచి మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పంజాల రాజన్న గౌడ్ తో పాటు మహిళలు యువకులు డివిజన్ ప్రజలు దాదాపు నూటయాభై మందికి రాజేందర్ రావ్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల నరసన్న, ఆర్ష మల్లేశం మల్లికార్జున రాజేందర్ గుడూరి మురళి కోటగిరి భూమా గౌడ్ వేల్పుల వెంకటేష్, పడాల అజయ్ గౌడ్ కొత్తూరు జగన్ గౌడ్ నేరేళ్ల నాగన్న గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు డివిజన్ ప్రజలు యువకులు మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సర్పంచుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్..-

సర్పంచుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్

#సర్పంచుల విజయంలో కీలక పాత్ర పోషించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్

ములుగు, నేటిధాత్రి:

 

రాష్ట్ర మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు
ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలో 12 కి 12 వార్డులు కాంగ్రెస్ పార్టీ బలపరచిన వార్డు సభ్యులు విజయం సాధించి 806 ఓట్ల భారీ మెజారిటీతో బిఆర్ఎస్ బలపరచిన అభ్యర్థిపై గెలుపొందిన ధారావత్ సరిత & సారయ్య,ఉప సర్పంచ్ పోరిక భద్రు నాయక్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అదే విధంగా
దేవగిరిపట్నం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి ఇస్లావత్ పూలమ్మ &సంతోష్ మరియు ఉప సర్పంచ్ ఇట్టబోయిన రాజు యాదవ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పొట్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి కందికొండ భాగ్యలక్ష్మి & రమేష్ ఉప సర్పంచ్ పాలడుగుల మురళి,వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపిన ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ములుగు మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికయిన సర్పంచులు గ్రామంలోని ప్రతి సమస్యనీ పరిష్కరించే విధంగా పని చేస్తూ గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరికి సహకరించాలని సూచించారు
ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క ఇచ్చిన ప్రతి హామీని తొందరలోనే ప్రారంభించి ప్రతి హామీ పూర్తి చేస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, పాక్స్ మాజీ వైస్ చైర్మన్ మర్రి రాజు యాదవ్,ములుగు మాజీ ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి,యూత్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల రేవంత్ యాదవ్,పత్తిపల్లి మాజీ సర్పంచులు బుర్రి రజిత,శ్రీలమంతుల రవీంద్రాచారి,దేవగిరిపట్నం మాజీ సర్పంచ్ ఎన్నారెడ్డి,పొట్లపూర్ మాజీ సర్పంచ్ అంకిరెడ్డి ములుగు పట్టణ యూత్ అధ్యక్షుడు అభినయ్ చారి,మైనారిటీ నాయకులు అజ్జు,యూత్ నాయకులు చందు, కన్ని,ఆయా గ్రామ కమిటీల అధ్యక్షులు సీనియర్ నాయకులు, యూత్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ దంపతులు….

అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ దంపతులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బదనపల్లి.టెక్స్టైల్ పార్క్ ఇందిరానగర్ సర్పంచ్ గడ్డం మధుకర్ చోటు. అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా గ్రామంలో గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా గెలిపించి న గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ గెలుపుకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారికి గ్రామంలో ఉన్న అవసరాలను అభివృద్ధి పథంలో తీర్చిదిద్దాలనిఅధ్యక్షుల వారికి తెలియజేస్తూ వారిని కలవడం జరిగింది అలాగే తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు మా విజయానికి సంబంధించి మాకు గెలవడానికి తోడ్పాటు అందించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా మా గెలుపునకు సహకరించిన కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మండల అధ్యక్షులు ప్రవీణ్ కి తెలియజేస్తూ. అధ్యక్షులును కలవడంతో పాటు రాబోయే రోజులలో మా గ్రామ సంబంధించిన కొన్ని విషయాలపై చర్చించి అభివృద్ధి పరచాలని అధ్యక్షులకు. తెలియజేయడంతో పాటు మమ్మల్ని దీవించి గ్రామ అభివృద్ధిలో మీ చేయూతని ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version