వార్డును సమూలంగా అభివృద్ధి చేస్తాం : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సవిత్రమ్మ
◆-: 4 వ వార్డు రాంజోల్ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
జహీరాబాద్ నేటి ధాత్రి;
జహీరాబాద్: 4 వ వార్డును సమూలంగా అభివృద్ధి చేసి, పట్టణంలోనే ఆదర్శ వార్డుగా నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అందరూ సైనికుల్లా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలకు కృతజ్ఞతగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం కట్టబెట్టాలని మాజి ఎంపిటిసి అల్గోల్ సవిత్రమ్మ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సవిత్రమ్మ పట్టణంలోని 4 వ వార్డు నుంచి తన నామినేషన్ ఫారం ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రవి కుమార్ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారెంటలను అమలు చేస్తూ ఇప్పటివరకు ఒక్క హామీని విస్మరించలేదని, మంత్రి దామోదర్ రాజనర్సింహ, స్థానిక ఎంపీ సురేశ్ షెట్కార్, ఇంచార్జ్ డా చంద్రశేఖర్ ల కృషితో 4 వ వార్డు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామాని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మవుర్ మల్లన్న, అల్గోల్ మల్లన్న, చౌల సంజీవ్ రెడ్డి, పిట్టల రవీందర్, మునిపల్లి రచన్న, మవుర్ వెంకట్, శ్రీశైలం, నర్సింలు, ఉమాకాంత్, సిద్దు, చంద్రకళ, భాగ్యమ్మ, శ్రావణి, అనుషమ్మ, రాధిక, హరిణి నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
