బడంపేట రచ్చన్న స్వామి దేవాలయం రేపు మూసివేత…

బడంపేట రచ్చన్న స్వామి దేవాలయం రేపు మూసివేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం బడంపేట గ్రామంలో రేపు చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదీన రచ్చన్న స్వామి దేవాలయం తాత్కాలికంగా మూసివేయబడుతుంది. ఆలయ ఈఓ శివారుద్రప్ప సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7:30 వరకు భక్తులకు దర్శనం నిలిపివేయబడుతుంది. అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణం, రుద్రభిషేకం నిర్వహించిన తర్వాత భక్తులకు అనుమతిస్తామని, అందరూ సహకరించాలని ఆలయ సిబ్బంది కోరారు.

కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం మూసివేత

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం, మార్చి 3వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా భక్తుల దర్శనార్థం తాత్కాలికంగా మూసివేయబడుతుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ప్రధాన, ఉప ఆలయాల ద్వారాలు మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత రాత్రి 7:45 గంటలకు శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి, స్వామి అమ్మవార్లకు పునఃప్రతిష్ఠాపన అనంతరం మంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version