రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విజ్ డమ్ విద్యార్థుల ఎంపిక.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విజ్ డమ్ విద్యార్థుల ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి:

ఇంటర్నేషనల్ స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరంగల్ లోని ఓసిటీ గ్రౌండ్ లో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో విజ్ డమ్ విద్యార్థులు ప్రతిభను కనబరచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ తెలిపారు. ఈనెల 20, 21న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురుకుల విద్యాపీట్ హై స్కూల్ జరిగే పోటీలలో పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎ. చందన, 9వ తరగతికి చెందిన బి. రాంప్రసాద్ పాల్గొననున్నారు.రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబరచి జాతీయ స్థాయిలో రాణించడం తమ లక్ష్యమని విద్యార్థులు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభను కనబరచిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, అకాడమిక్ ఇంచార్జి నాజియా ఇక్బాల్, వైస్ ప్రిన్సిపల్ ప్రకాష్, ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ ఫహీం సుల్తాన, కోచ్ రాజేష్, మధు, ప్రశాంత్ కుమార్, రియాజ్ లతో పాటు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version