ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దివ్యాంగులకు సరైన న్యాయం చేయ లేదు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన జిల్లా దివ్యాంగ.సమితి నాయకులు దొంతనేని.చందర్రావు . మాట్లాడుతూ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా చందర్రావు మాట్లాడుతూ. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ.పెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రంలో దివ్యాంగులకు తీవ్ర అన్యాయం చేసి. నిరాశ మిగిలించిందని తెలియజేస్తూ. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని. దివ్యాంగుల కోసం 6,000 పింఛను మంజూరు చేయాలని తెలియజేస్తూ. గతంలో ఇచ్చిన హామీలను నెరవేస్తారని రాష్ట్రంలో దివ్యాంగులంతా ఎంతో ఆశగా ఎదురు చూశారని. కానీ ప్రభుత్వం దివ్యాంగులకు ఎటువంటి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని. బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమాన్ని కనీసం పరిగణంలోకి తీసుకోకుండా బడ్జెట్ కేటాయించడం చాలా దురదృష్టకరమని. గత ప్రభుత్వం దివ్యాంగులకు 4000 రూపాయలు .పింఛన్ ఇచ్చిన మాట నిలుపుకున్న ఆనాటి ప్రభుత్వం. అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దివ్యాంగులకు 6000 .పింఛన్ ఇస్తామని .మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ రెండున్నర సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ప్రభుత్వం చెల్లించడం లేదని వెంటనే దివ్యాంగుల సంక్షేమానికి సరిపడా బడ్జెట్ కేటాయించాలని ఇచ్చిన మాట ప్రకారం 6000. రూపాయల. పెన్షన్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ లేని పక్షంలో వచ్చే మాసంలో తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగుల ఆధ్వర్యంలో తీవ్రమైన నిరసనలు కార్యక్రమాలు చేపడతామని. ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే దివ్యాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాజన్న సిరిసిల్ల జిల్లా దివ్యాంగుల సమితిల ఆధ్వర్యంలో జిల్లా నాయకులు దొంతినేని చందర్రావు డిమాండ్ చేశారు
