తంగళ్ళపల్లి మండలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏటా 125 రోజుల పని కల్పించాలని లక్ష్యంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వి వి జి రామ్ జి పథకాన్ని తీసుకొచ్చిందని అదేవిధంగా తెలంగాణలో ఆశించిన విధంగా పని దినాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందని. జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత .ఏడాదిన పార్లమెంట్ నియోజకవర్గంలో 32 కోట్ల 13 లక్షల ఖర్చు చేసి రోడ్లను నిర్మించడం మొత్తంగా చూస్తే ఇప్పటివరకు దాదాపు 700 కోట్ల రూపాయలు నిధులను మన పార్లమెంట్ పరిధిలో ఖర్చు చేశామని. కేంద్రం 2026. 27. కేంద్ర బడ్జెట్లో జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన. VB -G.RAM.G. పథకానికి 95,692 కోట్లను కేటాయించిన.మని. గ్రామ అభివృద్ధి శాఖ బడ్జెట్లో ఒక్కొక్క పథకానికి 40 శాతం నిధులు కేటాయించిన.మని మన తెలంగాణ విషయానికి వస్తే ఈ పథకం కింద ₹3,000 కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉందని. రాష్ట్రంలో సుమారు 32 లక్షల జాబ్ కార్డ్స్ హోల్డర్స్ ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారని ఏటా 125 రోజుల పాటు పని కల్పించాలని లక్ష్యంతో ఈ పథకాన్ని .తీసుకొచ్చినము. కానీ తెలంగాణలో ఆశించిన విధంగా పరిధిలో కల్పించడంలో విఫలమవుతున్నారని. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలోని ఆశించిన స్థాయిలో పని దినాలు కల్పించలేక.పోతున్నారని ఈ జిల్లాలలో 92000 జాబ్ కార్డులు ఉంటే సగటు 50 రోజుల లోపు మాత్రమే పని కల్పిస్తున్నారని 6000 లోపు కుటుంబాలకు మాత్రమే వందల పని దినాలు కల్పించారు. ప్రతి ఒక్కరికి ఏటా 125 రోజుల పని కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులను కోరుతున్నామని. ఈ పథకానికి అయ్యే వ్యయంలో 60 శాతం నిధులను కేంద్రం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సైతం జాప్యం లేకుండా 40% నిధులను విడుదల చేయాలని కోరుతున్నామని. పంచాయతీలకు మున్సిపాలిటీలకు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా ఇవ్వడం లేదని కానీ నిత్యం కేంద్రంపై .దుమ్మెoతి పోయడం .అలవాటైందని మోడీ ప్రభుత్వం ఎరువుల కొరత లేకుండా కావాల్సినవన్నీ ఎరువులను సరఫరా చేస్తున్న వాటిని అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ పెట్టడం లేదని ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా సీఎం రేవంత్.రెడ్డి .లాగులలో తొండలు.విడిస్తా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని. అలాగే దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ధార్మిక చింతనలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది అని ఏ గ్రామం వెళ్లిన ఏ ఆలయం వెళ్లిన సీతారామచంద్రస్వామి కళ్యాణ వేడుకలతో కల.కలాడుతూ ఉన్నాయని. ముందుగా అంకిరెడ్డిపల్లి గ్రామ. శివారులో గ్రామ సర్పంచ్ బిజెపి సభ్యుల నాయకుల కార్యకర్తల గ్రామ ప్రజల.ఆధ్వర్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కి గజమాలతో .ఘనంగా స్వాగతం పలికారు. అంకిరెడ్డిపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన ఐదు లక్షల తో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అలాగే గ్రామ కూడలిలో చత్రపతి శివాజీ మహారాజ్ .క్యాష్య విగ్రహాన్ని. కేంద్రమంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. గ్రామంలోని పలు సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయినీ.గోపి .బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డిపల్లి సర్పంచ్ రాగుల రాజిరెడ్డి. సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ఆడెపు.రవీందర్. తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షులు .వేన్నమనేని శ్రీధర్ రావు బిజెపి నాయకులు బీజేవైఎం. నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
