అధికార కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం…

అధికార కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల,నేటిధాత్రి

 

మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు,అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుకి ఓటు వేయాలని తెలిపారు.ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మవద్దని,గత ప్రభుత్వ పాలకుల వలనే పరకాల పట్టణం వెనుకబడిందన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని,ప్రజల కష్టసుఖాల్లో తోడు ఉండే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు.పట్టణంలో సిసి రోడ్,డ్రైనేజీ వ్యవస్థ త్రాగునీరు మరిన్ని వసతులతో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 వంట గ్యాస్,నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ,రైతు రుణమాఫీ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ చీరలు తదితర సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు.

 

కాంగ్రెస్ పార్టీలో చేరిన డిఎస్పీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

మున్సిపాలిటీ ధర్మసమాజ్ పార్టీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం ఝాన్సీ సుమన్ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.పరకాల పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని,మున్సిపాలిటీ ఎన్నికల్లో పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గడ్డం సుమన్,గడ్డం శివకుమార్, గడ్డం విశ్వనాథం, మధుసూదన్,గజవెల్లి రాజు, గడ్డం సతీష్,గడ్డం వెంకటయ్య,గడ్డం ఆంజనేయస్వామి,గడ్డం రాజమ్మ,దాదాపు 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ప్రజా సేవకే నా జీవితం అంకితం.. మామయ్య గారి బాటలోనే నా ప్రయాణం…

ప్రజా సేవకే నా జీవితం అంకితం.. మామయ్య గారి బాటలోనే నా ప్రయాణం

◆-: పేదల కష్టాలు తెలిసిన కుటుంబం మాది.. 5వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా!

◆-: రంజోల్ మాజీ సర్పంచ్ ఆశయ సాధనలో ‘అమ్ముల మధులత’.. ‘ఎయిర్ కండిషనర్’ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమరంలో 5వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన అమ్ముల మధులత తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తన అజెండాను, వార్డు అభివృద్ధిపై తనకున్న దూరదృష్టిని ప్రజలకు వివరించారు.
సేవాయే పునాది – మామయ్య ఆశయమే నా మార్గం గతంలో రంజోల్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు, తన మామయ్య గారు కొన్ని దశాబ్దాల పాటు సర్పంచ్‌గా సేవలందించారని అమ్ముల మధులత గుర్తు చేశారు. ఆ సమయంలో ఆయన అనేక మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడమే కాకుండా, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. “మా మామయ్య గారి హయాంలో జరిగిన అభివృద్ధి, ఆయన చూపిన సేవా మార్గమే నాకు స్ఫూర్తి. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, నేడు నేను మీ ముందుకు స్వతంత్ర అభ్యర్థిగా వచ్చాను,” అని మధులత తెలిపారు.ఇంటి వద్దకే పాలన – అర్హులకే పథకాలు ప్రజలు గెలిపిస్తే వార్డులో ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. “ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం నిజమైన అర్హులకే అందేలా చూడటమే నా ప్రథమ లక్ష్యం. వార్డులోని ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా, అవసరం ఉన్నవారి ఇంటి వద్దకే వెళ్లి సాయం చేసేలా నా పాలన ఉంటుంది,” అని ఆమె స్పష్టం చేశారు.ఎయిర్ కండిషనర్ (AC) గుర్తుకే మీ ఓటు(ఫిబ్రవరి 11న) జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లందరూ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని ఆమె కోరారు. బ్యాలెట్ పేపర్‌లో సీరియల్ నెంబర్ 4 వద్ద ఉన్న తన ఎన్నికల గుర్తు ‘ఎయిర్ కండిషనర్’ (Air Conditioner) పై ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. రాజకీయాలకు అతీతంగా, కేవలం సేవ చేయాలనే దృక్పథంతో వస్తున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని వార్డు ప్రజలను ఆమె కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version