వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి వైస్ చైర్మన్.

వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి వైస్ చైర్మన్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి వైస్ చైర్మన్ నే రెళ్ళ నరసింగంగౌడ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని సందర్శించి. వాటిని పరిశీలించారు. నిన్నటి రోజున అకాల వర్షాల కారణంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిన కారణంగా ధాన్యాన్ని. ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకనైనా రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యాన్ని ప్రభుత్వానికి. అందజేసి ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధరకు విక్ర ఇంచాలని. దళారులను నమ్మి రైతులు నష్టపోవద్దని. ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పొన్నాల . పరశురాం. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి. జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. మండల ప్రధాన కార్యదర్శి. రాజశేఖర్. కొత్త రవి గౌడ్. కిషన్. రమేష్. తదితరులు పాల్గొన్నారు

సన్న బియ్యం పంపిణిని ప్రారంభించిన AMC చైర్మన్.

సన్న బియ్యం పంపిణిని ప్రారంభించిన ఏఎంసి చైర్మన్

రామడుగు, నేటిదాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని రేషన్ దుకాణంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎఏంసి చైర్మన్ మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పిండి సత్యం, రేషన్ డీలర్ నార్ల మంగ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

పాల్వాయి శ్రీనివాస్ కి స్వాగతం పలికిన పరకాల.!

పాల్వాయి శ్రీనివాస్ కి స్వాగతం పలికిన పరకాల ఏఎంసి చైర్మన్ రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ మంగళవారం రోజున సందర్శించారు.మార్కెట్ కి విచ్చేసిన శ్రీనివాస్ ని పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికడం జరిగింది.

అలీ అద్వర్యంలో జెర్సీ పంపిణి..

మాజీ మైనారిటీ అధక్షులు అలీ అద్వర్యంలో జెర్సీ పంపిణి

ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మండల అధ్యక్షులు కట్కూరు దేవేందర్ రెడ్డి

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణానికి చెందిన మైనారిటీ యువకుల గ్రీన్ టైగెర్స్ క్రికెట్ టీంనకు మాజీ మైనారిటీ అధ్యక్షుడు ఎండి అలీ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మండల అధ్యక్షలు కట్కూరి దేవేందర్ రెడ్డి అతిధులుగా హాజరై జెర్సీలు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం సభ్యులతో పరిచయ కార్యక్రమం చేసుకొని క్రికెట్ జట్టు సభ్యులతో కలిసి ఆడి ఆటను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగారాజు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడెల్లి సదన్ కుమార్,ఉడుత సంపత్,దొమ్మటి దాసు,డాక్టర్ రోహిత్,వెంకటేష్ రాకేష్ లు పాల్గిన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version