అభివృద్ధి చేస్తా అవకాశం కల్పించండి…

అభివృద్ధి చేస్తా అవకాశం కల్పించండి : 8వ వాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంఠం శ్వేత కృష్ణారెడ్డి

* అలియాబాద్ లో గడపగడప ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ మున్సిపల్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడానికి మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని అలియాబాద్ మున్సిపల్ 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కంఠం శ్వేతా కృష్ణారెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అలియాబాద్ ఎనిమిదో వార్డులో గురువారం గడపగడప ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా మున్సిపల్ అభివృద్ధికి తనవంతుకు చేస్తానని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మంజుల, నాయకులు సింగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version