సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287 వ జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే కలెక్టర్…

సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287 వ జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే కలెక్టర్
వనపర్తి నేటిధాత్రి .

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి ఉత్సవాలను బుధవారం వనపర్తి జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నాగవరం దగ్గర సేవా లాల్ బంజారా భవన్ లో సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు వనపర్తి జిల్లాలో తాండాల నుండి గిరిజనులు పాల్గొన్నారు ముందుగా సేవాలాల్ మహారాజ్, మేరమ యాడి దేవతకు మహాబోగ్ హోమం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్, లంబాడి పూజారులు రాజ్ పవార్, బిక్ష్యా నాయక్ తో కలిసి సాంప్రదాయ బద్దంగా హోమంలో నెయ్యి కడావ్ ప్రసాదం వేసి నైవేద్యం సమర్పించారు. జిల్లాలోని సమస్త ప్రజలు ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలతో వర్ధిల్లె విధంగా ఆశీర్వదించాలని మొక్కారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ అందరికీ ఆదర్షప్రాయుడని, జీవ హింస చేయరాదనిఅబద్ధం మాట్లాడవద్దుదొంగతనాలు చేయవద్దు,మాంసాహారం చేయవద్దని బోధించారని గుర్తు చేశారుబంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చూపిన సన్మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని అన్నారు ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ 287వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారువనపర్తి నియోజకవర్గానికి రూ.2.68 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దౌర్జన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన యోధుడని అన్నారు.దొంగతనాలు చేయొద్దు, మాంసాహారం తినొద్దు అని బోధించారని గుర్తు చేశారు
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పిసీతారాం నాయక్ గిరిజన అభివృద్ధి అధికారి అధికారులు వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మిడిదొడ్డి మాధవి రమేష్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ మార్కెట్ యార్డు చైర్మన్ బిన్ శ్రీనివాస్ గౌడ్ శంకర్ నాయక్ , గిరిజన సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు, గిరిజన మహిళలు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version