అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి: ఎంపీ సురేష్ కుమార్..

అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి: ఎంపీ సురేష్ కుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పురపాలక సంఘంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో, స్థానిక ఎంపీ సురేష్ కుమార్ శేట్కార్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మరియు గౌరవ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా, జహీరాబాద్ మున్సిపల్ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎంపీ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కమీషనర్ జైత్ రాం, ఎంఆర్ఎ దశరథ్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తొలగించిన అర్బన్ ఏరియా ఆసుపత్రిని తిరిగి అందుబాటులోకి తెవాలి..

తొలగించిన అర్బన్ ఏరియా ఆసుపత్రిని తిరిగి అందుబాటులోకి తెవాలి..

◆-: కౌన్సిల్ సమావేశంలో గాళంఎత్తిన కౌన్సిలర్..

◆-: అదేవిధంగా ఇళ్ల మొటేషన్లు అయ్యేలా కరెంట్ మీటర్ల కు పర్మిషన్లు అందేలా చూడాలి..

◆-: 35 వ వార్డుకు చెందిన కౌన్సిలర్ ప్రవీణబేగం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్ పట్టణంలోని శాంతినగర్ ప్రజలంద రికీ అందుబాటులో ఉండే ఆరోగ్య నిమిత్తం గత ప్రభుత్వం ఏరియా అర్బన్ ఆసుపత్రిని ఏర్పాటు చేయగా రెండు మూడు నెలల క్రితం దాన్ని తొలగించడం జరిగింది. మంగళవారం నాడు మున్సిపల్ మున్సిపల్ సర్వసభ సమావేశంలో 35వ వార్డుకు చెందిన కౌన్సిలర్ ప్రవీణబేగం కౌన్సిల్ లో గుర్తు చేస్తూ మళ్లీ ఆసుపత్రిని సద్వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ కౌన్సిల్లో గాళం విప్పడం జరిగింది. అదేవిధంగా ఐడిఏయంటి కాలానికి సంబంధించిన నిరుపేదలు ఇండ్లు కట్టుకోగా వాటికి అసెస్మెంట్ లు కావచ్చు, రిజిస్ట్రే షన్లు కావచ్చు, కరెంట్ మీటర్లు ఇవ్వకపోవడం శోచ నీయకరమైన విషయమని, కావున వాటన్నిటిని పరి గణించి వాటిని కూడా మీ దృష్టిలో ఉంచుకొని వెంటనే అసెస్మెంట్ లు గానీ, రిజిస్ట్రేషన్లు గాని,మొ టేషన్లు గాని, ఐడిఎయంటి కాలనీలో ఇల్లు కట్టుకున్న ప్రతి ఇంటికి పర్మిషన్ ఇవ్వాలని యంపిని, మున్సిపల్ చైర్మన్ ను కమిషనర్ ను, కౌన్సిల్ సర్వసభ సమావేశంలో ఆమె కోరారు..

వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా మీడిదొడ్డి మాధవి రమేష్…

వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా మీడిదొడ్డి మాధవి రమేష్

,వైస్ చైర్మన్ గా మధుసూదన్ గౌడ్

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి మున్సిపాలిటీ నుండి కొత్తగా ఎన్నికైన 33 మంది కౌన్సిలర్ల చే ప్రత్యేక అధికారి ఆర్ డి ఓ ప్రమాణ స్వీకారం ఆర్డీఓ సుబ్రమణ్యం చేయిoచారు
మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికైన 33 మంది సభ్యులను జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు వనపర్తి మున్సిపాలిటీలో పరోక్ష విధానం ద్వారా చైర్ పర్సన్,వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక కొరకు సోమవారం మున్సిపల్ కార్యాలయ ములో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు
33 మంది సభ్యులున్న వనపర్తి మున్సిపాలిటీ లో ​చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు చట్ట ప్రకారం 17 మంది సభ్యుల కోరం అవసరం ఉండగా సమావేశానికి 22 మంది20 మంది కాంగ్రెస్ ఇద్దరు స్వతంత్రులుసభ్యులు హాజరయ్యారు కోరం సభ్యుల ప్రతిపాదన మేరకు అధికారులు చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించా రు మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి మీడిదొడ్డి మాధవి పేరును వనపర్తి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి పరుశురాం ప్రతిపాదించగా 4వ వార్డు కౌన్సిలర్ గంధం శరవంద బలపరిచారు మరో అభ్యర్థి పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో మీడిదొడ్డి మాధవి ని చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ఆర్ డి ఓ సుబ్రహ్మణ్యం ప్రకటించారు అనంతరం వైస్ చైర్ పర్సన్ గా గురకొండ మధుసూదన్ గౌడ్ పేరును 5వ వార్డు కౌన్సిలర్ బాపన్ పల్లి వెంకటేశ్వర్లు ప్రతిపాదించగా, 31వ వార్డు కౌన్సిలర్ బి. విజయలక్ష్మి బలపరిచారు. మరో పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో వైస్ చైర్ పర్సన్ గా గురుకొండ మధుసూదన్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అధికారి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లను ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు డి పి ఆర్ ఓ వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి,ఎన్నికల అధికారులు,మున్సిపల్ అధికారులు ఎన్నికైన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.S

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version