అధ్యకులుగా రాఘవేంద్ర చారి..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట్. మండల కేంద్రంలోని శ్రీవాణి సంస్థ నూతన భజన మండలి కమిటీ శనివారం రోజు షాద్ నగర్ శ్రీవాణి ప్రధాన కార్యదర్శి కన్నా మాస్టర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా కమిటీ ఏర్పాటు చేశారు. దయ పంతులపల్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర చారి అధ్యక్షులుగా..ప్రధాన కార్యదర్శి కొల్లూరు శివ కుమార్, కోశాధికారి తిమ్మాయపల్లి కేశవులు, నియమించినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సంస్థ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అన్ని మండలాల్లో ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు..సంస్థ ఆధ్వర్యంలో 1500 పైగా భజన కార్యక్రమం నిర్వహించామని అంతరించిపోతున్న కలలను పున ప్రారంభించాలని ప్రతి గ్రామంలో భజన సంకీర్తన జరగాలని ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్ గౌడ్, మూడా డైరెక్టర్ గండు చెన్నయ్య, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు చిగుళ్లపల్లి నర్సింలు, ఆయా గ్రామాల భజన భక్తులు చంద్రయ్య, యాదవ్ లక్ష్మయ్య చారి,పాండురంగయ్య,తదితరులు పాల్గొన్నారు..