ప్రతి కుటుంబానికి లబ్ది కలిగే పథకాలు….ఎమ్మెల్యే సతీమణి నిమ్మల

సూర్య కుమారి

నేటిదాత్రి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు (ఏప్రిల్ 23 )

రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే టిడిపి జనసేన బిజెపిf కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే పథకాలు అందుతాయని నిమ్మల సూర్యకుమారి తెలిపారు. ఆమె మంగళవారం పాలకొల్లు పట్టణ 28వ వార్డులో టిడిపి జనసేన బిజెపి శ్రేణులతో కలిసి కూటమి ఉమ్మడి అభ్యర్థి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. లబ్ధి చేకూరే పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంచారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు28వ వార్డు మాజీ కౌన్సిలర్ పొట్నూరి అప్పన్న,వార్డు అధ్యక్షులు కెల్లా లక్ష్మీనారాయణ, కార్యదర్శి ఎర్ర బాబి, కడలి త్రిమూర్తులు, జనసేన వార్డు అధ్యక్షులు విన్నకోట గోపి,రాష్ట్ర టీడీపి కార్యదర్శి పెచ్చేట్టి బాబు, టిడిపి పట్టణ అధ్యక్షులు gv, జనసేన జిల్లా కార్యదర్శి బోనం నరసయ్య,జనసేన పట్టణ అధ్యక్షులు సిడగం సూరి, అల్లు రాధాకృష్ణ, మండాది అవినాష్, పెండ్యాల భవాని అంబల్ల లక్ష్మీ జ్యోతి ద్రాక్షారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *