ఎమ్మెల్యే ఆదేశాలతో ట్రాన్స్ఫార్మర్ మంజూరు

గంగాధర నేటిధాత్రి :

మండల కేంద్రంలోని 9వ వార్డ్ లో ట్రాన్స్ఫార్మర్ లోడ్ సరిపోక కరెంట్ సమస్య ఉందని అక్కడి ప్రజలు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వినతిపత్రం ఇవ్వగా, ఎమ్మెల్యే ఆదేశాలమేరకు విద్యుత్ అధికారులు పరిశీలించి 25kv ఉన్న ట్రాన్స్ఫార్మర్ బదులు 63 kv ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసి శనివారం విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ఫార్మర్ ను బిగించారు. విద్యుత్ సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే కు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంత్రి లత, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!