Multiple Vehicles Collide at Rayapalli Chowrasta
రాయిపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం…
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండల పరిధిలోని రాయిపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఒక బస్సు,కర్ణాటక ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు,ఒక డీసీఎం ఒకదానికొకటి ఢీకున్నాయి అటుగా వెళుతున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఎన్నికల ఇంచార్జీ దేవీప్రసాద్ తమ వాహనాలు ఆపి ప్రమాద వివరాలను ఘటన స్థలం వద్ద ఉన్న వారిని అడిగి తెలుసుకుని క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించి వైద్యులను మెరుగైన చికిత్స అందించాలని కోరారు
