prajasevaye maa lakshyam, ప్రజాసేవయే మా లక్ష్యం

ప్రజాసేవయే మా లక్ష్యం

ప్రజాసేవయే లక్ష్యంగా అరూరి గట్టుమల్లు మెమోరియల్‌ ఫౌండేషన్‌ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని అరూరి గట్టుమల్లు మెమోరియల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ అరూరి విశాల్‌ అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఫౌండేషన్‌ చైర్మన్‌ అరూరి విశాల్‌ హజరై ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్‌కి వచ్చే పేషేంట్స్‌కి మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో చలివేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి పాలకుర్తి సారంగపాణి, మార్కెట్‌ చైర్మన్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, ఇల్లందుల సుదర్శన్‌, హాస్పిటల్‌ సుపరింటెండెంట్‌ స్వామి, గుడ్ల సుభాష్‌, ఎంపిటిసిలు రాజమణి, లక్ష్మీ, అన్వర్‌, టి.శ్రీదర్‌, మండల నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల యాకయ్య, సిలువేరు కూమరస్వామి, ఎలేందర్‌రెడ్డి, మదు, శ్యాంసుందర్‌రెడ్డి, దేవెంద్ర, పూజారి రఘు, పులి శ్రీను, టి.సురేష్‌, బొంత కాంతం, రాజేందర్‌, టి.రవిందర్‌. కె.శ్రీను, హాస్పిటల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *