police sibbandipie suspention veetu,పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

ఎన్నికల విధులకు గైర్హాజరయిన ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేసారు. సస్పెషన్‌ వేటుకు గురైయిన వారిలో యు.రాజు సుబేదారి పోలీస్‌స్టేషన్‌, వి.నిరంజన్‌ సంగెం పోలీస్‌ స్టేషన్‌, ఇ.గణేష్‌ సిటి గార్డ్స్‌, కె.ఉపేందర్‌ కమలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌, డి.శ్రీనివాస్‌ రఘనాధ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందినవారు వున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్బంగా సెలవుల్లో వున్న 69మంది సిబ్బంది తక్షణమే విధుల్లో చేరి ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి వుంది. ఇలా సెలవులో వెళ్లిన వారికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అదేశాల మేరకు సెలవులో వున్న పోలీస్‌ సిబ్బంది తక్షణమే ఎన్నికల విధుల్లో చేరిపోవాలని సంబంధిత పోలీస్‌స్టేషన్ల ద్వారా నోటీసులను సైతం జారీచేశారు. అందులో 64మంది సిబ్బంది తిరిగి విధుల్లో చేరగా ఈ నోటీసులకు స్పందించకుండా ఎన్నికల విధుల్లో చేరేందుకు రాకుండా ఆలసత్వంతో వ్యవహరించిన మిగితా ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్ల తీరుపై ఎన్నికల కమీషన్‌ నియమాలను అనుసరించి సదరు ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్ళను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

……………………………………………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *