పెకాటా స్థావరంపై పోలీసుల దాడి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణ పోలీసులు రాత్రి సమయంలో జహీరాబాద్ పరిదిలో పెకాటా స్థావరంపై దాడి చేసి 6 గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.8,550/- నగదు, మరియు 52 పెకాటా ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు, జహీరాబాద్ పరిధిలో గల హౌసింగ్ బోర్డు కాలనీ శివారు లో 6 గురు వ్యక్తులు పెకాటా ఆడుతున్నట్లు తెలిసింది. దీంతో జహీరాబాద్ టౌన్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. వినయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట రీత్య చర్య తీసుకుంటాడని తెలిపారు.
